HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Minister Nakka Anand Babu Fires On Cm Jagan

Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

  • Author : Prasad Date : 16-12-2023 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు అన్నారు. టీడీపీ హాయాంలో సన్ రైజ్ స్టేట్ గా విలసిల్లిన రాష్ట్రాన్ని, జగన్ రెడ్డి కామెడీ స్టేట్ గా మార్చార‌ని.. రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా చేసినందుకు నిజంగా ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఎవరు కట్టిన భవనాల్లో ఉంటూ.. ఎవరిచ్చిన భూముల్లో తిరుగుతూ చట్టాలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాల‌న్నారు. ప్రజలకోసం, రాష్ట్రం కోసం నిర్మించతలపెట్టిన అమరావతిని పూర్తిచేయలేని జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశార‌ని నక్కా ఆనంద్‌బాబు మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి దురాగతా లపై పోరాడుతున్నారని.. అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతుకూలీలపై జగన్ రెడ్డి 1700లకు పైగా అక్రమ కేసులు పెట్టించారని ఆయ‌న ఆరోపించారు. ముఖ్యంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి వారిని రోడ్లపై తిప్పార‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు నాయుడి హాయాంలోనే రాజధాని అమరావతిలో సచివాలయం.. హైకోర్టు భవనం.. ప్రజావేదిక వంటి అనేక భవనాలు నిర్మించడం జరిగిందని ఆయ‌న గుర్తు చేశారు. ఎమ్మెల్యేల నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్.. ఉద్యోగుల కోసం వసతి గృహాల సముదాయం వంటి నిర్మాణాలు దాదాపు 90శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే పూర్తయ్యాయన్నారు. రూ.10 వేలకోట్లు వెచ్చించి వివిధ నిర్మాణాలు చేయడం జరిగిందని.. అలానే పేదలకోసం టిడ్కో ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు. 90శాతం పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, వాటిని కూడా జగన్ రెడ్డి నాలుగేళ్లపాటు నిరుపయోగంగా గాలికి వదిలేశార‌ని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు.. దండుపా ళ్యం ముఠాకంటే దారుణంగా అమరావతిని దోచేశారని ఆరోపించారు. చివరకు టీడీపీప్రభుత్వం నిర్మాణాలకోసం తరలించిన సామగ్రిని, ఆఖరికి రోడ్లను కూడా తవ్వుకొని కంకర, మట్టిని అమ్ముకునే దుస్థితికి జగన్ రెడ్డి ముఠా దిగజారిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి అమరావతికి మద్ధతు తెలిపార‌ని.. ఆనాడే అభ్యంతరం తెలిపి ఉంటే, భూములిచ్చే ముందు రైతులు ఆలోచించేవారేమోన‌న్నారు. విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఇచ్చారు. అది అమరావతేనని ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.

Also Read:  TS : గతంలో మంత్రులకు సైతం ప్రవేశం లేని ప్రగతి భవన్ కు ఈరోజు సామాన్య ప్రజలు వస్తున్నారు – రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravathi Capital
  • andhra pradesh
  • ap tdp
  • Ex minister nakka anand babu
  • farmers

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

    South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

Latest News

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

  • JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd