HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Home Minister Vasantha Nageswara Rao Fire On Ap Cm Ys Jagan

Vasantha Nageswara Rao : ఏపీ సీఎం పై `వ‌సంత` తిరుగుబాటు!

లేటుగానైన లేటెస్ట్ గా.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న అన్యాయంపై మాజీ హోంమంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు గ‌ళంమెత్తారు.

  • Author : CS Rao Date : 22-11-2022 - 1:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Vasantha
Jagan Vasantha

లేటుగానైన లేటెస్ట్ గా.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న అన్యాయంపై మాజీ హోంమంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు గ‌ళంమెత్తారు. ఆయ‌న కుమారుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వైసీపీ ఎమ్మెల్యేగా ప్ర‌స్తుతం మైల‌వ‌రం నుంచి ఉన్నారు. రెండోసారి జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన క్యాబినెట్ 2.0లో స్థానం కోసం ప్ర‌య‌త్నం చేసి విఫ‌లం అయ్యారు. తొలి క్యాబినెట్ లో క‌మ్మ సామాజిక‌వర్గం నుంచి ఒకేఒక మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆ విష‌యాన్ని సీనియ‌ర్ పొలిటిషియ‌న్ వ‌సంత నాగేశ్వ‌ర‌రావు గుర్తు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి వాల‌కంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇతర అగ్ర కులాలతో పాటుగా కమ్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రెడ్డి విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డిన కొత్తజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. దీంతో జిల్లాలోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం సంబ‌ర‌ప‌డి సీఎంకు స‌న్మానాల‌ను చేసింది. ఆ ఆనందాన్ని ఆస్వాదించ‌క‌ముందే హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ ను తొల‌గించారు. ఇదే విష‌యాన్ని వసంత గుర్తు చేస్తూ ఏపీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌పై ఆవేద‌న చెందుతూ జగన్ మోహన్ రెడ్డికి చుర‌క‌లు వేశారు. ఆయ‌న గ‌ళం విన్న వాళ్లంతా వ‌సంత ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెబుతోంద‌ని ప్రచారం మొద‌లు పెట్టారు. దీంతో వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి నాగేశ్వ‌ర‌రావు కుమారుడు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. న‌ష్టనివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

Also Read:  AP Politics : చంద్ర‌బాబు మాట‌ల‌పై జ‌గ‌న్ రివ‌ర్స్

రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శంసించారు. అమ‌రావ‌తి అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన ప్రాంతంగా ఎందుకు గుర్తించ‌డంలేద‌ని జగన్ మోహన్ రెడ్డిని నిల‌దీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కమ్మ సామాజిక‌వ‌ర్గానికి ఉద్దేశ‌పూర్వ‌కంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్ర‌హించారు. అంతేకాదు, విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని ఆవేద‌న చెందారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల పైన స్పందించారు. గుంటూరు-విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని వసంత అభిప్రాయపడ్డారు. విజయవాడలో రైల్వే జంక్షన్, విమానాశ్రయం, కృష్ణా నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేక నిర్మాణాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటిని మార్చే ప్రయత్నం చేయలేద‌ని జ‌గ‌న్ కు చుర‌క‌లేశారు. ఏపీలో కంటే తెలంగాణ అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని కొనియాడారు. కమ్మ సామాజిక వర్గంలో దాదాపు 35శాతం మంది ఓటర్లు జగన్ మోహన్ రెడ్డిని 2019 ఎన్నిక‌ల్లో ఆదరించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల్లో 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌న‌ను ఆప్కాబ్ ఛైర్మన్‌గా వైఎస్సార్ నియమించిన విష‌యాన్ని అవ‌లోక‌నం చేశారు. స్వ‌ర్గీయ వైఎస్ అన్ని వ‌ర్గాల‌ను గౌరవించే వార‌ని కొనియాడారు. అప్పట్లో ఇద్దరికి కమ్మ సామాజిక వర్గం నుంచి వైఎస్ మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డంతో తాడేపల్లి వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఎలాంటి ఎండ్ వసంత చేసిన కీల‌క వ్యాఖ్య‌లకు ఉంటుందో చూడాలి.

Also Read:   IT Raids : ఐటీ దాడుల‌పై `గులాబీ ద‌ళం`మంత్రాంగం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • kamma kapu
  • Vasantha Nageswara rao
  • YS Jagan Mohan Reddy

Related News

Arava Sridhar Janasena Mla

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

JanaSena Party  ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd