HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ercs Approval For Increase In Electricity Charges In Andhra Pradesh Will Come Into Force From Tomorrow

Electricity Charges Hike : షాకింగ్.. రేపటి నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు

కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది.

  • By Pasha Published Date - 12:17 PM, Sat - 30 November 24
  • daily-hunt
Electricity Charges HIKE IN AP

Electricity Charges Hike :  ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్. రేపటి (డిసెంబరు 1) నుంచి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డిసెంబరు 1 నుంచి ఒక యూనిట్‌ విద్యుత్‌కు 92 పైసలు చొప్పున ఛార్జీలు పెరుగుతాయి. ఈ పెంపు 2026 నవంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారి కరెంటు బిల్లు అదనంగా రూ.184 మేర పెరుగుతుంది.

Also Read :Eknath Shinde : ‘మహా’ సస్పెన్స్.. సాయంత్రంకల్లా ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం

కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ విద్యుత్ రాయితీలకుగానూ రూ.9,412 కోట్లలో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా,  దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది. ఈఆర్సీ అనుమతి మేరకు రూ.9,412 కోట్లలో డిస్కంలు ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లను వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి. మిగిలిన రూ.6,543.60 కోట్లను డిసెంబర్‌ 1 నుంచి 2026 నవంబర్‌ వరకూ వసూలు చేయాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read :KTR Break : రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్

ఏ డిస్కం పరిధిలో ఎంత పెంపు ?

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్‌‌పీడీసీఎల్‌) పరిధిలో యూనిట్‌కు 0.9132 పైసలు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9049 పైసలు చొప్పున కరెంటు ఛార్జీలు పెంచనున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచింది. నాటి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ప్రజలకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Electricity Charges
  • electricity charges hike
  • ERC

Related News

Cbn Google

Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

Google : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ ఐటీ హబ్‌గా మార్చే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • Fake Alcohol

    Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు

  • Botsa Satyanarayana

    Conspiracy : మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర – బొత్స

Latest News

  • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd