East Godavari : సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని చావబాదిన గ్రామ వాలంటీర్
'సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?" అంటూ శశిధర్ ను చావబాదాడు.
- By Sudheer Published Date - 07:40 PM, Sat - 26 August 23
ఏపీలో గ్రామ వాలంటీర్ల (Volunteer ) దారుణాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదొక వివాదంలో వాలంటీర్ పేరు వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే హత్యలు , మానభంగాలు, దోపిడీలు , డబ్బులు కాజేయడాలు చేసి వార్తల్లో నిలువగా..తాజాగా గోదావరి జిల్లాలో ఓ బాలుడు సిగరెట్లు తీసుకురాలేదనే కోపంతో ఆ బాలుడ్ని చావబాది..డాబాపై నుంచి కిందకు తోచేసాడు. దీంతో ఆ బాలుడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఏపీలో అధికారం చేపట్టిన జగన్..ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ఉద్దేశ్యంతో రాష్ట్రంలో వాలంటీరి వ్యవస్థను తీసుకొచ్చాడు. గ్రామంలో వాలంటీర్లను నియమించి ప్రజల అవసరాలను తీర్చాలని అనుకున్నాడు. కానీ వాలంటీర్లు మాత్రం పలు నేరాలకు పాల్పడుతూ..జగన్ కు చెడ్డ పేరును తీసుకొస్తూ..విమర్శల పాలుచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో దారుణాలు బయటకు రాగా..తాజాగా ఇప్పుడు మరో దారుణ ఘటన బయటకు వచ్చింది.
కోరుకొండ మండలం కణుపూరు గ్రామానికి కల్యాణం సతీష్ (23) (East Godavari Volunteer) గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తల్లోజు శశిధర్ ను..సతీష్ సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. అయితే శశిధర్ తీసుకరానని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్.. గ్రామంలో బుర్ర కథ కార్యక్రమం జరుగుతుండగా బాలుడు శశిధర తో పాటు మరో బాలుడిని తన బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. ఊళ్లో తిప్పుతూ… చివరగా ఊళ్లో సామిల్లు దగ్గర ఉన్న డాబా పైకి తీసు కువెళ్లాడు. అక్కడకు వెళ్లగానే సతీష్ శశిధర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also : AP : పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేస్తారా..? పోసాని దిమ్మతిరిగే సమాధానం
‘సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?” అంటూ శశిధర్ ను చావబాదాడు. కొట్టొద్దంటూ మరో బాలుడు ప్రాధేయ పడగా, ఇద్దరినీ కలిపి కొట్టాడు. ఇద్దరూ తప్పించుకోడానికి కిందికి దిగి వెళ్లిపోబోతుండగా శశిధర్ ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి కిందకు పడిపోయాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సతీష్ బెదిరించాడు. కొంతసేపటికి శశిధర్ ను తానే వాహనంపై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి దింపాడు.
గుడి మెట్లు ఎక్కుతుండగా కిందపడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్ర గాయాలైన బాలుడిని తల్లిదండ్రులు మర్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో తగ్గలేదు. దీంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఎక్స్ రే లు తీసి అక్కడ శస్త్ర చికిత్స నిర్వహించారు. అసలు జరిగిన విషయం వారం తర్వాత తల్లిదండ్రులకు శశిధర్ చెప్పడం తో..బాలుడి తల్లి లక్ష్మి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలుడికి రెండు కాళ్లు, కుడిచేతికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఒక కాలికి, చేతికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపింది. వెంటనే వాలంటీర్ సతీష్ ఫై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసింది. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి శనివారం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు.
Related News
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.