HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Early Election Meet Lobbying Towards Mundastu Behind The Invitation Of Delhi Elders For Jagan

Early Election : `ముంద‌స్తు` దిశ‌గా లాబీయింగ్, ఢిల్లీ పెద్ద‌ల ఆహ్వానం మ‌త‌ల‌బు!

ఢిల్లీ పెద్ద‌లు ఆహ్వానించ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌స్తిన‌కు వెళ్లారు.

  • Author : CS Rao Date : 28-12-2022 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Before Election
Jagan Modi

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అపాయిట్మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లారా? లేక హ‌స్తిన బీజేపీ పెద్ద‌ల(Delhi BJP) ఆహ్వానం మేర‌కు ఆయ‌న దేశ రాజ‌ధానికి వెళ్లారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌. విశ్వ‌స‌నీయంగా తెలుస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఆహ్వానించ‌డంతో హ‌డావుడిగా మంగ‌ళ‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌స్తిన‌కు వెళ్లారు. అంటే, రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కాద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లోని టాక్‌. కేవ‌లం రాజ‌కీయ‌ప‌ర‌మైన ప‌ర్య‌ట‌న‌గా ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ముంద‌స్తుకు(Early Election) వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధమ‌వుతున్న క్ర‌మంలో దిశానిర్దేశం ఇవ్వ‌డానికి బీజేపీ పెద్ద‌లు ఆహ్వానించి ఉంటారని స‌మాచారం.

Also Read : Before electons : వ‌చ్చే ఏడాది ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు?

ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీని క‌లిసిన సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు (Early Election) ఆలోచ‌న ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దానికి అనుగుణంగా పార్టీ ప్లీన‌రీ వేదిక‌గా దిశానిర్దేశం ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ రోజు నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం, మంత్రుల‌తో బీసీ భేరి త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను పెట్టారు. ఇటీవ‌ల రెండుసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. మ‌రో ఆరు నెల‌ల గ‌డువు ఇస్తూ ఆ లోపు గ్రాఫ్ ఏ మాత్రం పెంచుకోక‌పోతే టిక్కెట్ ఇవ్వ‌లేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. మ‌రో ఏడాదికో, రెండేళ్ల‌కో అంటూ ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఇటీవ‌ల ముంద‌స్తుకు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేలా రాజ‌కీయం ఊపందుకుంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు (Early Election)

ఏపీకి రావాల్సిన బ‌కాయిలు, పోల‌వ‌రం గురించి చ‌ర్చించ‌డానికి ఢిల్లీ వెళుతున్న‌ట్టు సీఎంవో కార్యాల‌యం య‌థాలాపంగా చెబుతోంది. కానీ, వాటి కోసమైతే ఢిల్లీ పిలుపు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ముంద‌స్తు మీద ఒక క్లారిటీ ఇవ్వ‌డానికి ఢిల్లీకి పిలిపించిన‌ట్టు తెలుస్తోంది. కేంద్రం అండ‌దండ‌లు ఉండాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ప‌రోక్ష మ‌ద్ధ‌తు ప‌లికింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మ‌రో వైపు అన్ని ర‌కాలుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌హ‌కారం అందించారు. ఇప్పుడు ప్ర‌తిగా కేసీఆర్ కు అండ‌గా నిల‌వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల కలిసి ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌తిపాద‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ‌ద్ద ప్ర‌స్తావించ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Also Read : Election Note : ఎన్నిక‌ల వేళ 2వేల నోటుకు మూడింది.!

వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. అదే త‌ర‌హాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఆలోచిస్తూ ఇద్ద‌రూ క‌లిసి ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. దీనికి తోడు న‌రేంద్ర మోడీ కూడా ముంద‌స్తుకు వెళ్ల‌నున్నార‌ని ఇటీవ‌ల హ‌స్తిన వేదిక‌గా చ‌ర్చ న‌డిచింది. బ‌హుశా అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు(Delhi BJP) పిలిపించారా? అనే అనుమానం కూడా ప్ర‌త్య‌ర్థుల్లో క‌లుగుతోంది. మొత్తం మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది.

ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు పాద‌యాత్ర‌లు

దేశ వ్యాప్తంగా రాహుల్ భార‌త్ జోడో యాత్ర చేస్తున్నారు. ఇంకో వైపు రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు పాద‌యాత్ర‌లు, బ‌స్సు యాత్ర‌ల‌కు సిద్ధం అవుతున్నారు. ఏపీలో పాద‌యాత్ర‌కు లోకేష్ తేదీని ప్ర‌క‌టించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ బ‌స్సు యాత్ర‌కు బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక తెలంగాణ‌లో బీజేపీ యాత్ర‌ల‌కు సిద్ధం అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌కు జన‌వ‌రి 26న దిగుతున్నారు. ఇలా విప‌క్ష పార్టీల నేత‌లు యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలో ముంద‌స్తు స్పీడ్ ను ఢిల్లీ వేదిక‌గా కేసీఆర్ త‌ర‌పున కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెంచుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : KTR CM : కేటీఆర్ ప‌ట్టాభిషేకంపై దోబూచులాట‌! `ముంద‌స్తు`కు ముడి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • before election
  • cm delhi tour
  • cm kcr
  • early elections

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd