Visakhapatnam: మద్యం మత్తులో మహిళ వీరంగం.. తప్పిన ప్రమాదం
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది.
- By Praveen Aluthuru Published Date - 04:28 PM, Wed - 2 August 23
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ అనేది ప్రాణాల మీదకు కొనితెచ్చుకున్నట్టే. తాజాగా ఏపీలో ఓ మహిళ మద్యం సేవించి హల్చల్ చేసింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
A #Speeding car created havoc on the VIP road in #Vizag, as rammed into 8 bikes, parked near Paradise Hotel.
Allegedly a female doctor was driving the car in an inebriated condition, last night.#AndhraPradesh #Visakhapatnam #CarAccident #DrunkandDrive #RoadSafety #RoadAccident pic.twitter.com/N5rmQDH6x8— Surya Reddy (@jsuryareddy) August 2, 2023
విశాఖపట్నంకు చెందిన మహిళ మద్యం సేవించి తన కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పార్క్ చేసిన 8 ద్విచక్ర వాహనాలపైకి ఎక్కించింది. దీనిపై పోలీసులు కేసు బుక్ చేసి విచారిస్తున్నారు. పోలీసు రామారావు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం అర్థరాత్రి విశాఖపట్నంలోని సోమా బార్ సమీపంలో వీఐపీ రోడ్డుపై ఆగి ఉన్న ఎనిమిది ద్విచక్ర వాహనాలను కారు అతివేగంతో ఢీకొట్టింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోయిందని స్థానికులు సమాచారం ఇచ్చారు.
Also Read: Koheda Market: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కోహెడ, రూ. 403 కోట్లతో నిర్మాణం
Related News
KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.