HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Double Decker Metro Rail In Andhra Pradesh

AP Metro Rail: ఏపీకి డబల్ డెక్కర్ మెట్రో రైల్…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మరియు విజయవాడ లో మెట్రో ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి సిద్ధమైంది. 66 కిలోమీటర్ల విజయవాడ మెట్రో మరియు 76.90 కిలోమీటర్ల విశాఖ మెట్రో ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

  • By Kode Mohan Sai Published Date - 03:20 PM, Fri - 3 January 25
  • daily-hunt
Ap Metro Rail
Ap Metro Rail

AP Metro Rail: విశాఖపట్నం మరియు విజయవాడలో మెట్రో ప్రాజెక్టులను త్వరగా ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు నగరాల్లో మొదటి దశ మెట్రో ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టే ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను ఆమోదించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది

విశాఖపట్నం మరియు విజయవాడలో మెట్రో ప్రాజెక్టులను త్వరగా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కిలోమీటర్ల విజయవాడ మెట్రో మరియు 76.90 కిలోమీటర్ల విశాఖ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు ఇప్పటికే ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి మెట్రో ప్రాజెక్టుల స్థితిగతులను వివరించే ప్రజెంటేషన్ ఇచ్చారు.

2017 లో రూపొందించిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం, రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి ఫండింగ్ మోడల్స్ పై ముఖ్యమంత్రి చర్చించారు. 2017 వరకు కేంద్రం 100 శాతం నిధులు భరించేది కాదు, అయితే 2017 నాటి పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ, కొల్ కత్తాలో 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును చేపట్టారు.

రూ.8,565 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు రైల్వే శాఖలు కలిసి కొల్ కత్తా మెట్రో ప్రాజెక్టును అమలు చేశాయి. అదే విధంగా, ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సిఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమయినా…లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ మెట్రో విధానం:

విశాఖపట్నం మరియు విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. ఈ విధానం ప్రకారం, హైవే ఉన్న ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మిస్తారు. ఇందులో కింద రోడ్డు, దానిపై ఫ్లైవోవర్, ఆపై మెట్రో ఉంటుంది.

విశాఖపట్నంలో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు మరియు గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు.

ఈ విధానం ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో అమలులో ఉంది, కాబట్టి ఏపీలో కూడా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరగా సంప్రదింపులు జరిపి, మెట్రో పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. 4 ఏళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రావాలని, ఈ లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, బిసి జనార్థన్ రెడ్డి, మరియు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Metro Rail
  • CM Chandrababu
  • Double Decker Metro Rail In AP
  • Minister BC Janardhan Reddy
  • Minister Narayana

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd