AP Crime: దళితుడిపై మూత్రవిసర్జన..సీఎం జగన్ హయాంలో దళితులపై దాడులు
ఆంధ్రప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వ్వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులు దళిత వ్యక్తిపై దాడి చేసి మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 09:33 AM, Sun - 5 November 23
AP Crime: ఆంధ్రప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వ్వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులు దళిత వ్యక్తిపై దాడి చేసి మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు.బాధితుడిని శ్యామ్కుమార్గా గుర్తించారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.నిందితులను ఫాస్ట్ట్రాక్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం మేరకు ఆరుగురు నిందితులు దళిత వ్యక్తిని నాలుగు గంటలపాటు కొట్టారని, నీళ్లు కావాలని అడగడంతో నిందితులు మూత్ర విసర్జన చేశారని అధికారులు తెలిపారు.ఈ సంఘటన తెరపైకి వచ్చిన తర్వాత టిడిపి ఎస్సి సెల్ నిరసన చేపట్టింది మరియు రోడ్ల దిగ్బంధించింది. కంచికచర్ల సమీపంలో హైవేను దిగ్బంధించి టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎంఎస్ రాజు ఆధ్వర్యంలో హైవేకు ఇరువైపులా నిరసన ధర్నా నిర్వహించారు. ‘వీ వాంట్ జస్టిస్’ అనే నినాదాన్ని ప్రదర్శించారు. .
టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో దళితులపై అనేక దాడులు కొనసాగుతున్నాయి. శ్యామ్ కుమార్ అనే యువకుడిపై అధికార పార్టీ అనుచరులు దాడి చేశారు మరియు స్టేషన్ బెయిల్ పొంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని వాపోయారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారందరినీ అరెస్టు చేయాలని అన్నారు.
Also Read: Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది