BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
- By Balu J Published Date - 03:45 PM, Sat - 16 December 23
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తు ఉందని, జనసేన పార్టీ మరోలా చెప్పలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన పురంధేశ్వరి అనంతరం దండమూడిలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్లో ప్రకటించిందని, అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించే ప్రణాళికలను కూడా పురంధేశ్వరి ప్రస్తావించారు. “బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోందని, నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించడం, ఓటరు నమోదు వంటి వాటిపై పోరాడేందుకు కట్టుబడి ఉంది” అని పురంధేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇళ్లు మంజూరు చేయడాన్ని పురంధేశ్వరి ఎత్తిచూపగా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో శ్వేతపత్రం ఇవ్వలేదని విమర్శించారు.
Also Read: Delhi CM: విపాసన సెషన్ కు ఢిల్లీ సీఎం క్రేజీవాల్
Related News
Venkaiah Naidu: నేతలు పార్టీలు మారడం..డిస్ట్రబింగ్ ట్రెండ్ః వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
Venkaiah Naidu: భారతీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award)అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా.. అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో �