HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Collectors Conference Chaired By Cm Chandrababu Naidu Today And Tomorrow

Collectors Conference : నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విజన్‌, జిఎస్‌డిపి గురించి ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. 11:40 గంటల నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌, ఆర్‌టిజిఎస్‌పై ఐటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రెజెంటేషన్‌ ఇస్తారు.

  • Author : Latha Suma Date : 25-03-2025 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Collectors Conference chaired by CM Chandrababu Naidu today and tomorrow
Collectors Conference chaired by CM Chandrababu Naidu today and tomorrow

Collectors Conference : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విజన్‌, జిఎస్‌డిపి గురించి ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. 11:40 గంటల నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌, ఆర్‌టిజిఎస్‌పై ఐటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రెజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం గ్రీవెన్స్‌ రెసిడెన్షియల్‌ స్టేటస్‌పై చీఫ్‌ సెక్రటరీ ప్రెజెంటేషన్‌ ఇస్తారు.

Read Also: SBI- HDFC: ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. మార్చి 31 వ‌చ్చేస్తుంది!

జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యలు, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై తొలి రోజు చర్చించనున్నారు. ఇంతకు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సాధించిన ప్రగతిపై సమీక్ష చేయనున్నారు. తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం భూముల సర్వే గురించి సిసిఎల్‌ఎ ప్రెజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం సీజనల్‌ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రెజెంటేషన్‌ ఆయా శాఖల సెక్రటరీలు ఇవ్వనున్నారు. తొలుత మంచినీటి సమస్య, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల గురించి జలవనరులశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఎక్స్‌ అఫీషియో చీఫ్‌ స్పెషల్‌ సెక్రటరీ చెరువులు నింపడం గురించి ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

అనంతరం పశుసంవర్ధకశాఖ, వేసవిలో ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తారు. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉపాధిహామీ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు గురించి వివరిస్తారు. అర్బన్‌ ప్రాంతాల్లో మంచినీటి సమస్యపై మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులు గురించి విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. రూప్‌టాప్‌ సోలార్‌, పిఎం సూర్యఘర్‌, గ్రీన్‌ కవర్‌, నగర వనం, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ (మేజర్‌ ఫారెస్ట్‌) ఎకో టూరిజం గురించి కలెక్టర్లకు సిఎస్‌ వివరిస్తారు. సాయంత్రం సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బిసి వెల్ఫేర్‌, మైనార్టీ వెల్ఫేర్‌, పి4 గురించి ప్లానింగ్‌ సెక్రటరీ వివరించనున్నారు. వీటితో పాటు 2025-26 జిల్లాల్లో చేపట్టనున్న యాక్షన్‌ ప్లాన్‌, 15 శాతం గ్రోత్‌ రేట్‌ గురించి వివరించనున్నారు. రెండోరోజు సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ గురించి డిజిపి వివరిస్తారు. ఇక, ముగింపు సందేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

Read Also: Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Collectors Conference
  • Revenue Issues

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd