CM Jagan : నేడు కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
వార్షిక ఉర్సు ఉత్సవాల్లో భాగంగా నేడు (నవంబర్ 30న) సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప అమీన్పీర్ దర్గాను సందర్శించనున్నారు.
- Author : Prasad
Date : 30-11-2023 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
వార్షిక ఉర్సు ఉత్సవాల్లో భాగంగా నేడు (నవంబర్ 30న) సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప అమీన్పీర్ దర్గాను సందర్శించనున్నారు. అమీన్ పీర్ పెద్ద దర్గా సందర్శించి అనంతరంలో దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు. అమీన్ పీర్ దర్గా వార్షిక ఉర్సు ఉత్సవం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో దర్గాకు చేరుకోనున్న నేపథ్యంలో ఎస్పీ సిద్దార్థకౌసల్ ఆధ్వర్యంలో కడప పోలీసులు పాత కడప నగరంలోని విమానాశ్రయం నుంచి దర్గా వరకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ దర్గాలో పీర్కు చద్దర్ సమర్పించి ప్రార్థనలు చేస్తారని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చారిత్రక దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా, బుధవారం అమీన్ పీర్ సీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.