HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Went To The Beneficiary House And Distributed The Pensions

NTR Bharosa Pensions : లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

  • Author : Latha Suma Date : 31-12-2024 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu made coffee at the beneficiary's house
CM Chandrababu made coffee at the beneficiary's house

NTR Bharosa Pensions : ఏపీలో ఈ రోజు ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లా యలమందలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు. ఈ సందర్బంగా ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం. దీపం పథకం గురించి ఆరా తీసి, ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి, కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు గారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5… pic.twitter.com/luEcljbUp4

— Telugu Desam Party (@JaiTDP) December 31, 2024

కరోనా సెకండ్ వేవ్ సమయంలో శారమ్మ భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కూతురుకి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం, మరో రూ. 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ సొమ్మును రెండింతలు పెంచింది. వృద్ధులకు, వితంతువులు, ఇతరత్రాలకు రూ.4వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6వేలు. మంచానికి పరిమితమైన వారితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.15వేలు ఇస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో, ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి, బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది.

అంతకుముందు యల్లమందలోని కోదండ రామాలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యల్లమందలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చాకలి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. నాగరాజు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి గొర్రెల షెడ్డును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉంటున్నామని, ఉద్యోగాలు కల్పించాలని కరుణ అనే మహిళ సీఎం చంద్రబాబుని కోరారు. ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read Also: BRS Vs Congress : 2024లో కాంగ్రెస్ సర్కారు పాలనపై ట్వీట్ల యుద్ధం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • NTR Bharosa pensions
  • Palnadu District
  • pension beneficiary home
  • Yallamanda

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd