HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cm Chandrababu Started Anna Canteen

Anna Canteens : అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు.

  • By Latha Suma Published Date - 01:50 PM, Thu - 15 August 24
  • daily-hunt
Cm Chandrababu Started Anna
CM Chandrababu started Anna canteen

Anna Canteens: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలో అన్న కాంటీన్లను ప్రారంభించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన గుడివాడలో సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్‌ను మరోసారి ప్రారంభించారు.అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ప్రజలకు వడ్డించారు. ఆ తర్వాత ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు కుటుంబ సమేతంగా భోజనం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు సైతం టోకేన్‌ తీసుకుని మరీ భోజన చేస్తూనే ప్రజలతో మాట్లాడారు. భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అయితే విశాఖలో మాత్రం అన్న క్యాంటీన్ల ప్రారంభాన్ని వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5 లకే ఆహారాన్ని అందిస్తారు.

గుడివాడ మున్సిపల్ పార్క్ సమీపంలో అన్న క్యాంటీన్‍ను ప్రారంభించి, భోజనం వడ్డించిన సీఎం చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు.#AnnaCanteensOnceAgain#NaraChandrababuNaidu#NaraBhuvaneswari #AndhraPradesh pic.twitter.com/EJYrOH8rhS

— Telugu Desam Party (@JaiTDP) August 15, 2024

కాగా, ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుండి పూటకు రూ.5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మిగత క్యాంటీన్లు శుక్రవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు.

గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన తరువాత, ప్రజలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు. ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్న చంద్రబాబు గారు.#AnnaCanteensOnceAgain#NaraChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/A0NtpEgN5o

— Telugu Desam Party (@JaiTDP) August 15, 2024

శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసివేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ వాటిని పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అన్నింటినీ ఒకేసారి సెప్టెంబర్‌లో పునః ప్రారంభిచాలని అనుకున్నారు. అయితే కొన్ని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయినందుకు ఇప్పుడు వంద వరకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగతావి వచ్చే నెలలో ప్రారంభిస్తారు.

Read Also: Solar Rooftop : ఆంధ్రాలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లు

 

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anna-Canteens
  • CM Chandrababu
  • vijayawada

Related News

Ap Liquor Scam Case

ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

Latest News

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd