E KYC : రేషన్ కార్డు దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
E KYC : ఈనెల 31వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు
- By Sudheer Published Date - 12:21 PM, Sat - 29 March 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP Govt) సర్కారు శుభవార్త అందించింది. రేషన్ కార్డుల్లో (Ration Card) పేర్లు ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ-కేవైసీ (E-KYC) చేయించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరింత సమయం ఇచ్చింది. ఈనెల 31వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులు ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో వారికి చివరి అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Clocks Tree : క్లాక్ ట్రీ.. ఘడీ వాలే బాబా.. మంచి టైం తెచ్చే మర్రిచెట్టు
అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇప్పటివరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని లబ్ధిదారులు, తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలతో వెంటనే సమీప రేషన్ డిపోలను సందర్శించి తమ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మార్గంలో ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం నిలిపివేయబడే అవకాశం ఉండటంతో, అందరూ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Weight Loss: 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా?
ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే అవకాశం తక్కువగా ఉందని స్పష్టం చేసింది. కావున రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సదుపాయాన్ని నిరంతరం పొందడానికి ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరిగా పాటించాల్సిన నియమంగా మారింది. కనుక లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.