HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Konaseema District Visit

CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!

భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.

  • Author : Gopi Date : 30-05-2025 - 8:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్‌కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,717.90 కోట్లను విడుదల చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,35,860 మంది లబ్ధిదారులు రూ.101.16 కోట్ల పింఛను సొమ్మును అందుకోనున్నారు.

కొత్తగా స్పౌజ్ పింఛన్లు

సాధారణంగా ఇంట్లో పింఛను తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాక భార్యకు వితంతు పింఛను తీసుకోవాలంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా వారు ఒకట్రెండు నెలలు పింఛను కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 12వ తేదీన 71 వేల మంది స్పౌజ్ పింఛన్లు అందుకోనున్నారు.

Also Read: Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

3 నెలల పింఛను ఒకేసారి

గత ప్రభుత్వంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండో నెల పింఛను ఇచ్చేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది లబ్ధిదారులకు చాలా ఉపయోగంగా మారింది. ఈ నెలలో 2 నెలల పింఛను కలిపి తీసుకునే లబ్ధిదారులు 1,22,975 మంది ఉండగా, 3 నెలల ఫింఛను కలిపి తీసుకునేవారు 9176 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.111.41 కోట్లను విడుదల చేసింది.

12 నెలలు.. రూ.34 వేల కోట్లు

భారత దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది. రూ.4 వేల నుంచి రూ. 15వేల వరకు ఫించన్ మొత్తాలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఫించన్ నిమిత్తం 12 నెలల్లో రూ.34 వేల కోట్లను వెచ్చించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు ఆర్థిక భరోసానిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • CM Chandrababu
  • Konaseema district
  • Konaseema News
  • Mummidivaram
  • tdp

Related News

Mahandu 2026

TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd