HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cm Chandrababu Konaseema District Visit

CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!

భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.

  • By Gopichand Published Date - 08:59 PM, Fri - 30 May 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్‌కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,717.90 కోట్లను విడుదల చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,35,860 మంది లబ్ధిదారులు రూ.101.16 కోట్ల పింఛను సొమ్మును అందుకోనున్నారు.

కొత్తగా స్పౌజ్ పింఛన్లు

సాధారణంగా ఇంట్లో పింఛను తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాక భార్యకు వితంతు పింఛను తీసుకోవాలంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా వారు ఒకట్రెండు నెలలు పింఛను కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 12వ తేదీన 71 వేల మంది స్పౌజ్ పింఛన్లు అందుకోనున్నారు.

Also Read: Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

3 నెలల పింఛను ఒకేసారి

గత ప్రభుత్వంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండో నెల పింఛను ఇచ్చేవారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది లబ్ధిదారులకు చాలా ఉపయోగంగా మారింది. ఈ నెలలో 2 నెలల పింఛను కలిపి తీసుకునే లబ్ధిదారులు 1,22,975 మంది ఉండగా, 3 నెలల ఫింఛను కలిపి తీసుకునేవారు 9176 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.111.41 కోట్లను విడుదల చేసింది.

12 నెలలు.. రూ.34 వేల కోట్లు

భారత దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది. రూ.4 వేల నుంచి రూ. 15వేల వరకు ఫించన్ మొత్తాలను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఫించన్ నిమిత్తం 12 నెలల్లో రూ.34 వేల కోట్లను వెచ్చించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు ఆర్థిక భరోసానిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • CM Chandrababu
  • Konaseema district
  • Konaseema News
  • Mummidivaram
  • tdp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd