HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chief Ministers Of Odisha Andhra Pradesh To Meet On Nov 9 Over Contentious Issues

9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.

  • Author : Hashtag U Date : 06-11-2021 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో నవంబర్ 9న భువనేశ్వర్ లో సమావేశం కానున్నారు. వంశధార నది మీదుగా నేరడి బ్యారేజీ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల సరిహద్దులోని కోట్టాయా గ్రామాల స్థితిగతులు ముఖ్యమంత్రుల ఎజెండాలో ఎక్కువగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని రాయగడ, గజపతి జిల్లాల్లోని 106 ఎకరాలకు పైగా భూమి నీటమునిగనుంది.దీంతో ఆయా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.నీట మునిగిన భూమికి పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది.అయితే ఆంధ్రా ప్రతిపాదనలపై ఒడిశా ప్రభుత్వం ఇంకా స్పందించలేదని అధికారులు అంటున్నారు.ఏపీ సీఎం జగన్ ఈ సమస్యను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని అధికారులు అంటున్నారు.

Also Read : 21మంది పిల్ల‌ల‌ సరుకుల‌కు నెల‌కు ల‌క్ష‌.. ఇంకా పిల్ల‌లు కావాలంటున్న త‌ల్లి..

అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు సమస్యపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.కొట్టాయ్య గ్రామాల సమస్య కూడా సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉంది.ఇటీవలి కాలంలో ఒడిశా సరిహద్దులోని విజయనగరం జిల్లాలోని గ్రామాల్లోకి ఆంధ్రా అధికారులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒడిశా పోలీసులు ఆ గ్రామాల్లోకి ఎవరిని రానివ్వకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొట్టయ్యా గ్రామాల ప్రజలు ఇటీవల విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్ను కలిశారు. తాము ఆంధ్రాలో భాగంగానే కొనసాగుతామని లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈ అంశంపై చర్చించి పరిష్కారానికి అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • naveen patnaik
  • Odisa
  • ys jagan

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd