AP : పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది
- By Sudheer Published Date - 04:30 PM, Mon - 1 April 24
ఏపీలో పింఛన్ పంపిణీపై రాజకీయ రంగు అల్లుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని, ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైసీపీ మరోవిధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. పింఛన్ పంపిణీకి చంద్రబాబు అడ్డు తగిలాడని, ఈసీ టీడీపీనేతలే పిర్యాదు చేసారని..అందుకే పింఛన్ ఇవ్వలేకపోతున్నామని..ఇప్పుడే ఇలా ఉంటె ప్రభుత్వంలోకి టీడీపీ వస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
అధికార పార్టీ నేతలు మాటలు నిజమే కావొచ్చు అని పింఛన్ దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని (CS Jawaha Reddy) టీడీపీ నేతల బృందం కోరింది.
మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ చేస్తున్న ప్రచారం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘1వ తేదీన పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ నెపాన్ని టీడీపీ, ఎన్నికల సంఘంపై నెడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని టీడీపీ ఎవరినీ కోరలేదు. వైసీపీ కుట్రలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు’ అని విమర్శించారు.
Read Also : Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Tags
Related News
Chandrababu : రాష్ట్ర ప్రజలనే కాదు సొంత చెల్లెను సైతం జగన్ మోసం చేసాడు
జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని ...అందుకే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్నారు