HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Congratulated The Collectors Of Palnadu And Krishna Districts

పల్నాడు, కృష్ణా జిల్లా.. కలెక్టర్లకు చంద్రబాబు అభినందన

  • Author : Vamsi Chowdary Korata Date : 02-01-2026 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap District Collector's
Ap District Collector's

AP CM Chandrababu Naidu : నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

  • ఇద్దరు కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
  • న్యూ ఇయర్ రోజు వినూత్న ఆలోచన చేశారు
  • విద్యార్థులకు ఉపయోగపడేలా అద్భుతో ఆలోచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జిల్లా కలెక్టర్లను అభినందించారు. న్యూ ఇయర్ రోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్, కృష్ణా జిల్లా కలెక్టర్లు చేసిన వినూత్న ఆలోచన బావుందని ప్రశంసించారు. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచిన కృష్ణ జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు ఇలా వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పల్నాడు జిల్లా కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ కృతికా శుక్లాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలిసి.. నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, డిక్షనరీలు, పెద్ద బాలశిక్ష వంటి పుస్తకాలను అందజేశారు. బొకేలు, శాలువాల బదులు ఇలా.. మొత్తం 1300 నోట్ బుక్స్, 275 ఇతర పుస్తకాలను అందించారు. ఈ వినూత్న ఆలోచనతో పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను వసతిగృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, అలాగే గ్రంథాలయానికి కానుకగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కూడా వినూత్నంగా ఆలోచించారు. న్యూ ఇయర్ రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, స్వీట్స్, శాలువాల వంటి అనవసర ఖర్చులు తగ్గించాలని కలెక్టర్ సూచించారు.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా, ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఇటీవల సూచించారు. ఈ సూచనను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అధికారులు, సిబ్బంది తమ వంతుగా ఈ సహాయాన్ని అందించారు. గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఈ వస్తువులను సమకూర్చారు.

ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని బాలికల సంక్షేమ వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. జిల్లాలో వివిధ శాఖ అధికారులు ఈ సాయాన్ని అందించారు. కలెక్టర్ డీకే బాలాజీకి 48 ఇన్సినరేటర్లు, 972 చిన్న బల్లలను హాస్టళ్ల కోసం అందజేశారు. ఈ ఇన్సినరేటర్లు, అంటే వాడిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా కాల్చివేసే యంత్రాలు, బాలికల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఇన్సినరేటర్ విలువ సుమారు రూ.12,500. వీటితో పాటు విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా చిన్న బల్లలను కూడా అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh CM
  • AP CM Chandrababu Naidu
  • Krishna District Collector
  • Palnadu District

Related News

Revenue Minister Anagani Sa

ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..

Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయ

  • Dugarajapatnam Port

    ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !

  • Kutami Govt

    2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

Latest News

  • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

  • భారీగా పడిపోయిన షేర్ ధర.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?

  • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

  • జైపూర్ లో పాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇదేం వెరైటీ !!

Trending News

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

    • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd