HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bapatla Granite Quarry Accident 6 Killed

Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..

Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.

  • By Kavya Krishna Published Date - 02:51 PM, Sun - 3 August 25
  • daily-hunt
Tragedy
Tragedy

Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. శనివారం ఉదయం పనిలో నిమగ్నమైన కార్మికులపై భారీ గ్రానైట్ అంచు ఒక్కసారిగా విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులందరూ ఒడిశాకు చెందిన వలస కూలీలుగా గుర్తించబడ్డారు.

సాక్షుల వివరాల ప్రకారం, క్వారీలో అప్పటికి 15 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. సాధారణంగా లాగే రాళ్లను చెక్కుతుండగా, ఎటువంటి హెచ్చరిక లేకుండా భారీ గ్రానైట్ అంచు ఒక్కసారిగా కూలిపోయింది. బండరాళ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు తప్పించుకునే సమయం దొరకలేదు. కొంతమంది మట్టి, రాళ్ల కింద చిక్కుకుపోగా, ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని హుటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

MS Dhoni: సీఎస్కే జ‌ట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రాథమిక దర్యాప్తులో క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, రాళ్ల స్థితి పరిశీలించకపోవడం వంటి అంశాలు ఈ ప్రమాదానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన సీఎం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “రోజువారీ కూలీలు మృతి చెందడం బాధాకరం. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వలస కార్మికుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి లాభాలు మాత్రమే దండుకుంటున్నారని వారు మండిపడుతున్నారు.

Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Ballikurava
  • Bapatla News
  • chandrababu naidu
  • Granite Quarry Accident
  • Industrial Negligence
  • Migrant workers
  • nara lokesh

Related News

Andhra Pradesh

Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.

  • Lokesh supports National Education Policy

    Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

  • Lokesh Og

    OG Movie : OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ట్వీట్

Latest News

  • RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

  • Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!

  • Dasara Pooja : దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు..!

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

  • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Trending News

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd