HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Liquor Price Hike Implemented

Liquor Price : ఏపీలో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి..

Liquor Price : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లను మినహాయించి మిగతా అన్ని బ్రాండ్‌లపై రూ. 10 చొప్పున ధర పెంచారు. మద్యం రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు నేపథ్యం, ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలను వివరంగా పరిశీలిద్దాం.

  • Author : Kavya Krishna Date : 11-02-2025 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Liquor Price
Liquor Price

Liquor Price : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెంచిన మద్యం ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహా మిగతా అన్ని బ్రాండ్లకు, సైజుతో సంబంధం లేకుండా, రూ. 10 చొప్పున ధరలు పెంచారు. దీంతో మందుబాబుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ధరలు పెంచడం అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందుబాబుల ఆగ్రహం, గందరగోళం
తమకి తెలియకుండానే మద్యం ధరలు పెరగడంతో మద్యం షాపుల వద్ద మందుబాబులు షాక్‌కు గురయ్యారు. కొందరు నిర్వహకులతో వాగ్వాదానికి దిగగా, మరికొందరు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పెంచడం ఏంటని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో పాత ధరలు ఉన్న పట్టికలు మార్చకపోవడంతో కస్టమర్లు మరింత కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో మద్యం ధరలను రూ. 15 నుంచి రూ. 20 వరకు పెంచారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవి అసత్య ప్రచారాలే అంటూ నిర్వాహకులు ఖండిస్తున్నారు. మద్యం బ్రాండ్, సైజు సంబంధం లేకుండా ప్రతి బాటిల్‌పై కేవలం రూ. 10 మాత్రమే పెంచినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Elephant Idols: ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే అదృష్టం కలిసివస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

మద్యం పాలసీలో మార్పులు – ప్రైవేట్ షాపులకు అవకాశం
గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సర్కారు లిక్కర్ షాపులకు స్వస్తి పలికి, ఎన్డీయే కూటమి ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపుల నిర్వహణ హక్కును టెండర్ల విధానంలో కట్టబెట్టింది.

ఇటీవల, మద్యం షాపుల నిర్వాహకులు తమ మార్జిన్ తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం కమిషన్‌ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచేందుకు అనుమతి ఇచ్చింది. 2019-24 కాలంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమీక్షించింది. అనంతరం, రిటైల్ వ్యాపారం, మద్యం ధరలు, పన్నుల విధానాలను పరిశీలించేందుకు ఎక్సైజ్ శాఖ ‘వే ఫార్వర్డ్’ రూపకల్పన చేసింది.

కేబినెట్ సబ్-కమిటీ సిఫార్సులు – మద్యం ధరల పెంపు
మద్యం రంగంలో సమర్థవంతమైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిటైలింగ్, ధరల నిర్ణయం, పన్నుల విధానం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ సిఫార్సుల ఆధారంగా, మద్యం రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో, మద్యం ధరలు సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా, పెంచిన ధరలను అమలు చేయాలని అధికారికంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, ఇవాళ్టి నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

Maha Kumbh Padayatra : రివర్స్‌లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alcohol Regulation
  • andhra pradesh
  • ap news
  • chandrababu naidu
  • excise department
  • excise policy
  • liquor price hike
  • NDA Government
  • Retail Liquor Shops

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd