ఏపీలో పంటల బీమాకు రూ. 3వేల కోట్లు
వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.
- By CS Rao Published Date - 03:14 PM, Fri - 2 September 22
వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై స్థానిక నాయకులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3000 కోట్ల పంటల బీమాను అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు.
పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీపై సీఎం సమీక్ష నిర్వహించి రైతులందరూ ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో వైద్యుల నియామకంపై సీఎం మాట్లాడుతూ.. ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. చక్రాయపేట మండలంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
Related News
Alla Ramakrishna Reddy : ముందు ఆర్కే తన విజయరేఖ చెక్ చేసుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతన్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.