AP Govt Debts : కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీ సర్కారు అప్పుల వేట
అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
- By Hashtag U Published Date - 11:24 AM, Sun - 3 April 22
అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ రుణాలు తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అందుకే కేంద్రం అనుమతులు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే బిల్లుల చెల్లింపుల కోసం ఉన్న అన్ని నిధులనూ వాడుకుంది. చివరకు చేబదుళ్లు కింద రూ.2,816 కోట్ల తీసుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణ పరిమితి రూ.79,454 కోట్లు ఉండొచ్చని అంచనా. రాష్ట్ర జీఎస్డీపీలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి 3.5 శాతం. అంటే దాదాపు 42 వేల కోట్ల రూపాయిలు అవుతుంది. గతంలో తిరిగి చెల్లించిన రూ.16 వేల కోట్లను ఈ పరిమితికి చేర్చాలని అంటోంది. ఇక మూల ధన వ్యయపరిమితితో లెక్కగట్టే రుణం దాదాపు రూ.6 వేల కోట్లు. దీంతోపాటు ఉమ్మడి ఏపీలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి దాదాపు రూ.26,380 కోట్లు. అంటే విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన వాటా 58.32 శాతం. దీని ప్రకారం దాదాపు మరో రూ.15 వేల కోట్లు అప్పు తెచ్చుకునే వెసులు బాటు ఉంటుందని ఏపీ సర్కారు అంటోంది. ఇవన్నీ కలిపితే.. రూ.79,454.31 కోట్లను అప్పుగా తెచ్చుకోవచ్చని ఏపీ సర్కార్ అంచనా వేసింది.
ఈ రూ.79,454.31 కోట్లలో వివిధ రకాల మినహాయింపులను తీసేస్తే.. దాదాపు రూ.71,876 కోట్లను అప్పుగా తీసుకోవచ్చని ఏపీ సర్కార్ భావిస్తోంది. అందుకే ఈమేరకు వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే.. కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న వ్యయ నియంత్రణ విభాగం.. అన్నీ లెక్కేసి.. తొలి 9 నెలల వరకు ఎంత అప్పు తెచ్చుకోవచ్చో చెబుతుంది. ఒకవేళ ఆ లెక్కలు ఆలస్యమైతే.. కనీసం ఏప్రిల్ నెల వరకైనా కొంత మేర రుణం తీసుకోవడానికి అనుమతులు ఇస్తుంది.
ఏపీ ప్రభుత్వానికి ఈ నెల గడవాలంటే కచ్చితంగా అప్పు తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలతోపాటు, పెన్షన్ల కింద రూ.5,500 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మార్చి నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఏపీ సర్కార్ వైఖరిపై ప్రభుత్వాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
Related News
Chandrababu : అమెరికాలో చంద్రబాబు.. ఆయన అడ్రస్ కోసం వెతుకుతున్న తెలుగువారు
ఉక్కపోతలో ఎన్నికల ప్రచార షెడ్యూల్లలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తి కావడంతో, అన్ని రాజకీయ నేతల నాయకులు తమ తీవ్రమైన షెడ్యూల్ల నుండి చాలా అవసరమైన విరామం తీసుకున్నారు.