Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
- By Hashtag U Published Date - 11:38 AM, Mon - 29 November 21
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జలుబు, దగ్గు లక్షణాలతో ఇబ్బందిపడ్డ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు తేలింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు గురికావడంతో రాజ్భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి.
గవర్నర్కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు.
Tags
Related News
AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై