HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Retracts 15 Acres Allocated To Sarada Peetham

Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.

  • Author : Kode Mohan Sai Date : 07-11-2024 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sada Bainama Lands
Vishaka Saradha Peetham Lands

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలంలోని కొత్తవలస సమీపంలో, రిషికొండ వద్ద 15 ఎకరాలను ఎకరాకు లక్ష రూపాయలకు శారదా పీఠానికి కేటాయించడంపై వివాదం కొనసాగుతోంది. ఈ భూమి విలువ 15 కోట్లు గా అంచనా వేయబడింది, అయితే ప్రభుత్వం ఈ భూమిని కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అనంతరం, రెవిన్యూ శాఖకు భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 225 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం 15 లక్షలకు కేటాయించడం పై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెవిన్యూ శాఖ అధికారులు పేర్కొన్న ప్రకారం, నిన్న (06-11-24) భూమిని పంచనామా చేసి, ఈరోజు (07-11-24) ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవిన్యూ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సిసోడియా ఈ సమాచారాన్ని అందజేశారు.

గత వైసీపీ ప్రభుత్వం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి విశాఖలో 15 ఎకరాలను కేవలం 15 లక్షల రూపాయలకు కేటాయించింది. ఈ భూమి విలువ సుమారు రూ. 225 కోట్లు కాగా, ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, భూమి ధర నిర్ణయించాలనే ప్రతిపాదనపై అప్పటి కలెక్టర్‌ను సంప్రదించారు. కలెక్టర్ ఆ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుని, ఎకరాకు రూ. 1.8 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు. అయితే, సీఎం జగన్ నిర్ణయంతో 15 ఎకరాలను కేవలం రూ. 15 లక్షలకే కేటాయించారు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర చర్చలకు దారితీశింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల కేటాయింపు పై విచారణ చేపట్టింది. విచారణలో, నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చబడింది. గత మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేయాలని తీర్మానించింది. అందుకు అనుగుణంగా రెవిన్యూ శాఖ తాజాగా ఈ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Swamy Swaroopananda Saraswati
  • Vishaka Saradha Peetam
  • Vishaka Sri Sarada Peetham swaroopananda swamy
  • ys jagan

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

  • కాఫీ తాగితే న‌ష్టాలే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ట‌!

  • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd