HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Gave Another Shock To Sharada Peetha

Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

  • Author : Sudheer Date : 24-10-2024 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sarada Peetham In Tirumala
Sarada Peetham In Tirumala

ఏపీ సర్కార్ (AP government)..శారదా పీఠం (Visakha Sarada Peetham)కు మరో షాక్ ఇచ్చింది. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని ఈ మధ్యనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక ఇప్పుడు తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) దేవదాయశాఖ నుంచి ఆదేశాలు జారీ చేసింది. గతేడాది, డిసెంబర్ 26న అప్పటి టీటీడీ బోర్డు శారదా పీఠానికి గోగర్భం వద్ద భూమిని కేటాయించింది. అయితే, ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం నుంచి సమీక్ష చేయమని టీటీడీని కోరుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు, దీనిపై తాజాగా రద్దు నిర్ణయం తీసుకున్నారు.

ఇక విశాఖ శారదాపీఠం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రముఖ పీఠం. ఇది శారదా దేవి, కన్యా లక్ష్మీ నరసింహ దేవుడి మరియు సనాతన ధర్మానికి అంకితమయిన పీఠంగా ప్రసిద్ధి చెందింది. శారదాపీఠం దైవిక విద్య, తత్వశాస్త్రం మరియు సంస్కృతిని ప్రచారానికి ముఖ్యమైన కేంద్రంగా నడుస్తుంది. ఇది తాత్త్వికతను, ప్రాచీన విద్యను మరియు భారతీయ సంస్కృతిని కొనసాగించడానికి విస్తారంగా ప్రయత్నిస్తోంది.

ఈ పీఠాన్ని పండితులు, ఆధ్యాత్మిక గురువులు మరియు అనేక ఆచార్యులు అనుసరితుంటారు. పూజ, యజ్ఞాలు, మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తోంది. విశాఖ శారదాపీఠం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు సదస్సులు నిర్వహిస్తుంది. ఇది విద్యార్థులకు మరియు సాధకులకు ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసేందుకు ఒక వేదికగా నిలుస్తోంది. అలాగే వివిధ కళలు, సంగీతం, నాట్యం, మరియు భక్తి రచనలు వంటి ప్రాచీన భారతీయ సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది.

Read Also : Lokesh – NVIDIA CEO : జెన్సన్ హువాంగ్ తో నారా లోకేష్ భేటీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • another shock
  • AP government
  • Sharada Peetham
  • tirumala

Related News

Andhra Pradesh Nursing Admissions 2026–27

నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Andhra Pradesh Nursing Admissions 2026–27  బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్య

    Latest News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    • Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd