HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Fee Reimbursement Nara Lokesh Brings Good News For Students

AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!

  • By Kode Mohan Sai Published Date - 01:10 PM, Wed - 23 October 24
  • daily-hunt
Ap Fee Reimbursement
Ap Fee Reimbursement

AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఈ రీయింబర్స్మెంట్ పట్ల త్వరలో మంచి సమాచారాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా మోసం చేసింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు మరియు విద్యాశాఖలోని సహచరులతో కలిసి పని చేస్తానని, త్వరలోనే శుభవార్త అందిస్తానని హామీ ఇస్తున్నాను” అని ఆయన ‘ఎక్స్’లో వెల్లడించారు.

GOOD NEWS SOON! 👍

To all our student friends: The YSRCP Govt has cheated you by not paying fee reimbursement dues to the tune of Rs.3500 crores. I'm collaborating with my colleagues in the Cabinet and Ministry to resolve this issue and assure you that you'll hear good news very…

— Lokesh Nara (@naralokesh) October 22, 2024

నిధులు ఉన్నా చెల్లించకుండా తాత్సారం:

ఏపీలో చివరి విడతగా, గత మార్చి 1న, విద్యాదీవెన నిధులను మాజీ సీఎం జగన్ విడుదల చేశారు. పామర్రులో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తున్నట్టు బటన్ నొక్కారు. విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

ఎన్నికల కోడ్‌ వచ్చేవరకు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పినా, అవి బటన్ నొక్కడం వరకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా, రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను, విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్టు ప్రకటించారు.

జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను మార్చి 1న విడుదల చేశారు. విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలకు, సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,002 కోట్లను ఖర్చు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో, వసతి దీవెన నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు జగన్ తెలిపారు.

ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను అభ్యసిస్తున్న వారికి రూ.20,000 చొప్పున రెండు విడతల్లో వసతిదీవెన ఫీజులను రీయింబర్స్ చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఎన్నికల కోడ్‌తో ఆగిన పంపిణీ:

విద్యాదీవెన బటన్ నొక్కినప్పటికీ, తల్లుల ఖాతాల్లో డబ్బులు చేరకపోవడంతో, కాలేజీలు విద్యార్థులపై కొన్నినెలలుగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండానే, ఏపీలో ప్రభుత్వం మారింది. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే విడుదల చేసినా, ఆ డబ్బులు విద్యార్థుల ఖాతాల్లో చేరలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను 2019కు ముందు ఉన్న పేర్లతో మార్చింది.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలలో, ఫ్యాకల్టీ, సదుపాయాలు, రేటింగుల ఆధారంగా ఫీజులు విధించబడ్డాయి. మంచి కాలేజీలలో సగటున రూ.77,000 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా, మొదటి విడతగా రూ.19,000 మాత్రమే విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన ఫీజులు చెల్లించకపోతే డిగ్రీ అర్హత పత్రాలను జారీ చేయమని, మిగతావారిని పరీక్షలకు హాజరు కానివ్వమని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు పదిలక్షల మంది ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు:

జగన్ అన్న విద్యా దీవెన ద్వారా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 9.45 లక్షలుగా ఉంది. ఈ మొత్తం విద్యార్థులలో 93 శాతం మందికి మంచి చేశామంటూ జగన్ తెలిపారు. విద్యాదీవెన మరియు వసతి దీవెన కింద రూ.3500 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Fee Reimbursement
  • fee reimbursement
  • nara lokesh
  • ys jagan

Related News

Lokesh supports National Education Policy

Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

Mega DSC : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt) విద్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలో ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కలిగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

  • Lokesh Og

    OG Movie : OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ట్వీట్

  • Lokesh Fire Assembly

    Vizag Steel Plant : వైసీపీ నేతలకు చెమటలు పట్టించిన నారా లోకేష్

  • Fees Of Private Schools

    Fees of Private Schools : ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ పై లోకేష్ క్లారిటీ

  • Minister Nara Lokesh

    AP Fee Reimbursement Dues: ఫీజు రీయింబర్స్ బకాయిలపై వైసీపీ దుష్ప్రచారానికి నారా లోకేష్ కౌంటర్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd