HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Congress Announced Indiramma Abhayam Scheme

Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..

  • Author : Sudheer Date : 26-02-2024 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Congress Announced Indir
Ap Congress Announced Indir

ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టారో..అదే విధంగా ఏపీలోను అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈరోజు అనంతపురంలో జరిగిన కాంగ్రెస్​ న్యాయ సాధన సభలో మొదటి హామీని షర్మిల ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా ఐదువేలు ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ అభయం (Indiramma Abhayam Scheme) కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మహిళల పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా అని ఈ సందర్బంగా షర్మిల చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు , జగన్ ల ఫై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క వైఎస్ జగన్ అని విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే.. ఈపాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదు. అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బీజేపీతో అంటకాగుతూ… ఆ పార్టీకి బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీకి మనకు ఏం ఇచ్చింది? మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదు. కానీ, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయని షర్మిల ప్రశ్నించారు.

కాంగ్రెస్ పక్షాన ఆందోళన చేస్తుంటే… నన్ను ఈడ్చి పడేశారని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్ట్ లో 54 ప్రాజెక్ట్ లు కడితే.. ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తుంటే చెల్లెలు అని కూడా చూడకుండా తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పోసి సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని అన్నారు, ‘ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లెలు ఉద్యమం చేసింది.. బై బై బాబు అంటూ ఉద్యమం చేసింది. మీకోసం ఇదే చెల్లెలు ఇంత కష్టం చేస్తే.. నా మీద, నా భర్త మీద నిందలు వేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నదీ దేవుడు చూస్తున్నాడు. ఎన్ని నిందలు వేసినా వైఎస్సార్ బిడ్డ భయపడదు..ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వైఎస్సార్ బిడ్డ ఇక్కడ నుంచి కదలదు’ అని షర్మిల స్పష్టం చేసారు.

Read Also : Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • congress
  • indiramma abhayam scheme
  • sharmila

Related News

Harish Rao

రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.

  • Congress ranks call for movement in wake of National Herald case

    నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd