Jagan on Pawan: నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చుకోలేం: పవన్ పై జగన్ ఫైర్!
ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- By Hashtag U Published Date - 03:34 PM, Wed - 28 June 23
ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద నగదు జమ చేయడానికి ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించారు. బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్.. జగన్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి బదులుగా సీఎం జగన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లా మనం భార్యలను మార్చలేమని నిప్పులు చెరిగారు. ఆయనలా రౌడీ మాదిరిగా తొడ కొట్టలేమని.. బూతులు తిట్టలేమని.. నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలనూ మార్చుకోలేమని ఎద్దేవా చేశారు.
పెళ్లి అనే వ్యవస్థను నడి రోడ్డు మీదకు తీసుకురాలేమని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా విమర్శించలేదని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు ఓ లారీ ఎక్కాడని.. దాని పేరు వారాహి అని.. దానిపై ఊగిపోతూ మాట్లాడుతున్నాడని జగన్ మండిపడ్డారు. తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటున్నాడని ధ్వజమెత్తారు. తాట తీస్తానని.. గుడ్డలు ఊడదీసి కొడతానని అంటున్నాడని దుయ్యబట్టారు.
ఎలాంటి అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.26 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. బటన్ నొక్కడం అంటే ఇది అని.. బటన్ నొక్కడం అంటే ఏంటో తెలియని బడుద్దాయిలకు చెప్పాలని మిమ్మల్ని కోరుతున్నా అని సభకు హాజరైనవారిని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. హామీలను నిలబెట్టుకోని చంద్రబాబును దత్త పుత్రుడు ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు మోసాల్ని ఆయన పాలించిన ఐదేళ్లలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం జగన్ పదే పదే పవన్ నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: Tamilisai Vs Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై ట్వీట్, హరీశ్ రావు కౌంటర్!
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.