Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.
- By CS Rao Published Date - 10:05 PM, Thu - 6 January 22
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాడు. ఆలోచించండి అని పరోక్షంగా చురకలు వేసాడు. నీతిఅయోగ్ ఇచ్చిన నివేదికలను చూపించాడు. వాటిని చూసి కూడా జీతాలు పెంచాలని కోరడం ఉద్యోగుల దివాళా కోరుతనం అవుతుంది.
జీతాలు టైం కి ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అప్పులతో రాష్ట్రం నడుస్తుంది. ఆ విషయం ఉద్యోగులకు బాగా తెలుసు. అయినప్పటికీ 14.9 శాతం ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలని వాళ్ల డిమాండ్. మొత్తం 70 రకాల డిమాండ్లను సీఎం ముందు ఉంచారు. వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిష్కరించలేమని జగన్ చెప్పాడని తెలుస్తుంది. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా అమలు చేయాలని పట్టు బడుతున్నారు. 14.9 ఫిట్మెంట్ ఇచ్చినా సుమారు 7 వేల కోట్లు భారం పడుతోంది. ఆ మేరకు ప్రజల నుంచి వసూలు చేయాలి. ఇప్పటికే జగన్ సీఎం అయిన తరువాత సుమారు 12 వేల కోట్లు ఉద్యోగులకు వివిధ రూపాల్లో లబ్ది కలిగిందని అంచనా. ఆ లబ్దిలో కొత్త గా ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బడ్జట్ లో 60 శాతం జీతాలకు పోతోంది. ఇంత పెద్ద మొత్తం వాటా ఏ రాష్ట్రంలో ను ఉద్యోగులకు ఇవ్వడం లేదు. అయినా ఉద్యోగులు జీతాల పెంచాలని డిమాండ్ చేయటం విమర్శలను ఎదుర్కొంటుంది.
కోవిడ్ మూడో వేవ్ వస్తుంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం రెండేళ్లు పని లేకుండా జనం డబ్బు జీతాల రూపంలో తీసుకొని సంతోషంగా ఉన్నారు. జీతాలు చాలవు అంటూ ఇంకా సీఎం మీద వత్తిడి తీసుకు రావడం వాళ్ల విజ్ఞతకు వదిలేయాలి. అందుకే జగన్ వాళ్ళను అర్థం చేసుకోమని వేడుకున్నాడు.
ఇప్పుడు ఏపీ రాష్ట్ర అప్పు సుమారు 7 లక్షల కోట్లు ఉందని చంద్రబాబు చెబుతున్నాడు. ఆయన కూడా ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతున్నాడు. ప్రభుత్వం,విపక్షాలు కలసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సమయం ఇది. ఓట్లను ఆలోచిస్తూ ఎవరికి వారే ఉద్యోగులకు మద్దతు పలికితే రాబోవు రోజుల్లో సామాన్యులు పన్నులు కట్టలేక తిరగబడక తప్పదు.
సీఎం జగన్ ఉద్యోగులకు లొంగితే ప్రజలపై భారం పడుతుంది. కేవలం 5 శాతం ఉద్యోగుల కోసం 95 శాతం ప్రజలను వ్యతిరేకత చేసుకోవడాన్ని ఆలోచించాలి. పేదలకు ధనికులకు మధ్య అంతరం పెరగడం సమాజానికి చేటు. ఆ విషయాన్ని జగన్ గమనించాలి. ఇప్పటి వరకు ఉద్యోగుల అడుగులకు మడుగులు వత్తుతూ ప్రజలపై భారం మోపారు . ఇప్పుడైనా జగన్ ఆలోచించి ఉద్యోగుల జీతాల పెంపు లేకుండా చేస్తారని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మిగిలిన సీఎం ల తరహాలో జగన్ కూడా ఉద్యోగుల వలలో చిక్కుకుంటాడా? లేక సరి కొత్త చరిత్రను రాస్తాడా? అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం