HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan And Jac Meet

Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట

ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.

  • Author : CS Rao Date : 06-01-2022 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాడు. ఆలోచించండి అని పరోక్షంగా చురకలు వేసాడు. నీతిఅయోగ్ ఇచ్చిన నివేదికలను చూపించాడు. వాటిని చూసి కూడా జీతాలు పెంచాలని కోరడం ఉద్యోగుల దివాళా కోరుతనం అవుతుంది.
జీతాలు టైం కి ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అప్పులతో రాష్ట్రం నడుస్తుంది. ఆ విషయం ఉద్యోగులకు బాగా తెలుసు. అయినప్పటికీ 14.9 శాతం ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలని వాళ్ల డిమాండ్. మొత్తం 70 రకాల డిమాండ్లను సీఎం ముందు ఉంచారు. వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిష్కరించలేమని జగన్ చెప్పాడని తెలుస్తుంది. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా అమలు చేయాలని పట్టు బడుతున్నారు. 14.9 ఫిట్మెంట్ ఇచ్చినా సుమారు 7 వేల కోట్లు భారం పడుతోంది. ఆ మేరకు ప్రజల నుంచి వసూలు చేయాలి. ఇప్పటికే జగన్ సీఎం అయిన తరువాత సుమారు 12 వేల కోట్లు ఉద్యోగులకు వివిధ రూపాల్లో లబ్ది కలిగిందని అంచనా. ఆ లబ్దిలో కొత్త గా ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బడ్జట్ లో 60 శాతం జీతాలకు పోతోంది. ఇంత పెద్ద మొత్తం వాటా ఏ రాష్ట్రంలో ను ఉద్యోగులకు ఇవ్వడం లేదు. అయినా ఉద్యోగులు జీతాల పెంచాలని డిమాండ్ చేయటం విమర్శలను ఎదుర్కొంటుంది.
కోవిడ్ మూడో వేవ్ వస్తుంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం రెండేళ్లు పని లేకుండా జనం డబ్బు జీతాల రూపంలో తీసుకొని సంతోషంగా ఉన్నారు. జీతాలు చాలవు అంటూ ఇంకా సీఎం మీద వత్తిడి తీసుకు రావడం వాళ్ల విజ్ఞతకు వదిలేయాలి. అందుకే జగన్ వాళ్ళను అర్థం చేసుకోమని వేడుకున్నాడు.
ఇప్పుడు ఏపీ రాష్ట్ర అప్పు సుమారు 7 లక్షల కోట్లు ఉందని చంద్రబాబు చెబుతున్నాడు. ఆయన కూడా ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతున్నాడు. ప్రభుత్వం,విపక్షాలు కలసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సమయం ఇది. ఓట్లను ఆలోచిస్తూ ఎవరికి వారే ఉద్యోగులకు మద్దతు పలికితే రాబోవు రోజుల్లో సామాన్యులు పన్నులు కట్టలేక తిరగబడక తప్పదు.
సీఎం జగన్ ఉద్యోగులకు లొంగితే ప్రజలపై భారం పడుతుంది. కేవలం 5 శాతం ఉద్యోగుల కోసం 95 శాతం ప్రజలను వ్యతిరేకత చేసుకోవడాన్ని ఆలోచించాలి. పేదలకు ధనికులకు మధ్య అంతరం పెరగడం సమాజానికి చేటు. ఆ విషయాన్ని జగన్ గమనించాలి. ఇప్పటి వరకు ఉద్యోగుల అడుగులకు మడుగులు వత్తుతూ ప్రజలపై భారం మోపారు . ఇప్పుడైనా జగన్ ఆలోచించి ఉద్యోగుల జీతాల పెంపు లేకుండా చేస్తారని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మిగిలిన సీఎం ల తరహాలో జగన్ కూడా ఉద్యోగుల వలలో చిక్కుకుంటాడా? లేక సరి కొత్త చరిత్రను రాస్తాడా? అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Chief Minister
  • Andhra Pradesh PRC
  • AP JAC
  • cm jagan
  • JAC

Related News

    Latest News

    • Grama Panchayat Elections : తెలంగాణ లో మా ప్రభంజనం మొదలైంది – బిఆర్ఎస్

    • Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

    • Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్‌ దర్శిస్తే చాలు!

    • Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    Trending News

      • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd