HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhrapradesh 9 Students Committed Suicide For Failing In Intermediate Exams

Andhrapradesh: ఏపీ ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. 9 మంది విద్యార్థులు ఆత్మహత్య

ఏపీ (Andhrapradesh) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Intermediate Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • Author : Gopichand Date : 28-04-2023 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sucide Imresizer
Sucide Imresizer

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఏటా జరుగుతున్నాయి. తాజాగా ఏపీ (Andhrapradesh) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Intermediate Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈతవాకిలికి చెందిన విద్యార్థిని అనూష(17) ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెంది గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

అనూష ఇటీవల కర్ణాటకలోని తన అమ్మమ్మ గ్రామానికి వెళ్లింది. బుధవారం విద్యార్థిని తల్లి ఫోన్ చేసి ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని చెప్పింది. రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి ఈసారి పాస్ చేస్తానని తల్లితో చెప్పింది. అయితే ఉదయం కుమార్తె మరణవార్త విని దిక్కుతోచని తల్లిదండ్రులు కర్ణాటక వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు (17) ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో గణితం సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: Helicopters Crash: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. అమెరికాలో ఘటన

అనకాపల్లికి చెందిన కారుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల చిన్న కుమారుడు కారుబోతు తులసి కిరణ్ (17) ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులు తక్కువ రావడంతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) గురువారం తెల్లవారుజామున టెక్కలిలో రైలు ఢీకొని మృతి చెందాడు.

విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో గురువారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి కూలి పనులు చేస్తూ కూతురిని చదివిస్తోంది. మృతదేహాన్ని రహస్యంగా శ్మశాన వాటికకు తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విశాఖ పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న బోనెల జగదీష్ (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాల్ గ్రామానికి చెందిన మహేష్ (17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. బుధవారం ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap students
  • inter exams
  • Intermediate Students
  • Students Sucide

Related News

Shivam Dube

వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత

Shivam Dube  న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆ

  • Yarraji Jyoti

    యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • TEAM INDIA WATCHED BORDER 2 MOVIE AT VARUN INOX THEATER

    విశాఖ వరుణ్ ఐనాక్స్‌లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు

Latest News

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

  • పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd