HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Poll Winds Set Revolving Doors In Motion Few Open Towards Congress Yet

AP Congress : చేరికల రేసులో కాంగ్రెస్ వెనుకంజ.. ఎన్నికల రేసులో ఏమయ్యేనో ?

AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

  • By Pasha Published Date - 01:51 PM, Tue - 16 January 24
  • daily-hunt
Ap Congress
Ap Congress

AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చకచకా పావులు కదుతుపుతున్నాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హవా నడిపించిన కాంగ్రెస్ మాత్రం సైలెంట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకొన్ని నెలల టైమే ఉన్నందున.. చాలామంది నాయకులు పార్టీలు మారడం  మొదలుపెట్టారు. వైఎస్సార్ సీపీ చాలాచోట్ల కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆయా చోట్ల సీట్లు దక్కనివారు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇక కొత్తగా పాలిటిక్స్‌లోకి వస్తున్నవారు కూడా టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేనలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఎంతగా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం(AP Congress) కసరత్తును మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాలనే వ్యూహంతో హస్తం పార్టీ ఉంది. దీనిపై రేపటికల్లా(జనవరి 17) ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. అదే జరిగితే.. కాంగ్రెస్‌కు కొంత జోష్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ఉన్న పేరు.. గతంలో ఏపీలో పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్లుగా మారే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి పార్టీలు మారుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీని అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదని ఇంకొందరు పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాక.. జనంతో పార్టీకి కనెక్టివిటీని పెంచడం అనే అతిపెద్ద టాస్క్ ఎదురవుతుంది. పదేళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్‌పై సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ పెంచేలా ప్రజలతో కాంగ్రెస్ మమేకం కావాలి. అలా అయితేనే పార్టీలు మారేందుకు రెడీ అవుతున్న నాయకులు.. కాంగ్రెస్ వైపు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.

Also Read: ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్

చేరికలన్నీ ఆ పార్టీలలోకే.. కాంగ్రెస్ వైపు చూడని వైనం

  • ఏపీలో ఎటుచూసినా టీడీపీ, జనసేన, బీజేపీలలోకి చేరుతున్న నాయకులే తప్ప.. కాంగ్రెస్‌లోకి చేరుతున్న నాయకులు కనిపించడం లేదు.
  • విజయవాడ నుంచి రెండుసార్లు టీడీపీ ఎంపీగా ఎన్నికైన కేశినేని శ్రీనివాస్(నాని) తన లోక్‌సభ సీటుతో పాటు పార్టీని వదులుకొని అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు. కేశినేని నానిని విజయవాడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతామని సీఎం జగన్ ఇప్పటికే  ప్రకటించారు.
  • విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఉన్న తన కుమార్తె కె.శ్వేతకు టీడీపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నాని మనస్తాపం చెందారట. అందుకే ఆయన పార్టీ మారారని అంటున్నారు.
  • టీడీపీపై  నాని కోపానికి మరో కారణం కూడా ఉందట. కేశినేని నాని  సోదరుడు కేశినేని శ్రీకాంత్‌కు టీడీపీలో ప్రాధాన్యతను పెంచారట. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  విజయవాడ స్థానం నుంచి శ్రీకాంత్‌కు టీడీపీ టికెట్ ఇవ్వనుందట. ఇక బీజేపీ తరఫున వైఎస్ చౌదరి కూడా పోటీచేయనున్నారు. అంటే ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి త్రిముఖ పోటీగా జరగబోతోంది.
  • ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన విజయవాడ లోక్‌సభ స్థానం ఇప్పుడు ఇతర పార్టీల ఆధిపత్యానికి కేంద్రం మారిన తీరుకు ఈ పరిణామాం నిదర్శనం.
  •  తొలుత వైఎస్సార్ సీపీలో చేరిన రిటైర్డ్ క్రికెటర్ అంబటి రాయుడు.. 10 రోజులైనా గడవకముందే  ఆ పార్టీని వీడిన జనసేన గూటిలోకి జంప్ అయ్యారు.
  • వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య  టీడీపీలో చేరారు.
  • ఈసారి వైఎస్సార్  సీపీ టిక్కెట్టు నిరాకరించిన పెనములూరు ఎమ్మెల్యే కే పార్థసారధి టీడీపీలోకి మారుతున్నారు.
  • హిందూపురం YSRCP MP గోరంట్ల మాధవ్‌కు ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆయన టీడీపీలోకి మారే ఛాన్స్ ఉంది.
  • గుంటూరుకు చెందిన టీడీపీ ఎంపీ, అమర రాజా గ్రూప్ డైరెక్టర్ జయదేవ్ గల్లా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారాలని అనుకుంటున్నారట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Poll
  • andhra pradesh
  • ap congress
  • ys sharmila

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd