HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Vp Kiran Kumar Chamala Hits At Bjp After Ed Summons Kavitha

ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్

ED - Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు ​​జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

  • Author : Pasha Date : 16-01-2024 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ed Kavitha
Ed Kavitha

ED – Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు ​​జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. లోక్‌సభ ఎన్నికల టైం సమీపిస్తున్నందునే కేంద్రంలోని  బీజేపీ సర్కారు మరోసారి డ్రామాకు తెరలేపిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ చమల వ్యాఖ్యానించారు.  ‘‘బీఆర్‌ఎస్‌కు తాము ఏ టీమ్ కానీ.. బీ టీమ్ కానీ కాదని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ నుంచి నోటీసులను పంపుతోంది’’ అని విమర్శించారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఓడిపోబోతున్నందున.. ఈ పరిస్థితిని అదునుగా  తీసుకొని తెలంగాణలో ఓటు శాతాన్ని మరింత పెంచుకునే ప్లాన్‌లో బీజేపీ ఉంది’’ అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, బీజేపీ, బీఆర్ఎస్‌ల ఇలాంటి వ్యూహాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని  చూపించవని ఆయన(ED – Kavitha) స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ(మంగళవారం) విచారణకు  హాజరుకావాలని కోరింది.  అయితే దీనిపై కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత తెలియజేశారు. ఈడీ నోటీసులపై తాను  ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించానని.. దానిపై పిటిషన్ పెండింగ్‌లో ఉండగా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఈడీ అధికారులకు కవిత లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేవరకు.. విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.  గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళనైన తనను విచారణ కోసం.. ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు.

Also Read: Free Download : ‘శ్రీరామ్‌ చరిత్‌ మానస్’‌కు ఆర్డర్ల వెల్లువ.. నేటి నుంచి ఫ్రీ డౌన్‌లోడ్

ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టు విచారణలో ఉన్న సమయంలోనే.. గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ మళ్లీ నోటీసులు పంపటంతో.. కవిత కూడా అదే వాదనతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం కోర్టు.. గతేడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అప్పట్నుంచి ఈ కేసులో కవితకు ఎలాంటి నోటీసులు రాలేదు. తాజాగా ఇప్పుడు నోటీసులిచ్చారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో.. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • ED - Kavitha
  • ED summons
  • kavitha
  • Kiran Kumar Chamala
  • TPCC VP

Related News

Karimnagar Mayor As Kolagani Srinivas

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Survey

    Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్

  • Kavitha Municipal Election

    తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd