Donkey Slaughter: గాడిద వధపై ఉక్కుపాదం.. 800 కిలోల మాంసం స్వాధీనం
గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు 800 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- By Gopichand Published Date - 06:40 AM, Thu - 1 December 22
గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు 800 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వధకు ఉంచిన కనీసం 100 గాడిదలను రక్షించారు. గాడిద మాంసం దాదాపు మటన్ వంటి ఖరీదైనది. ఇది తింటే ఎటువంటి రోగాలు అయినా తగ్గుతాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నందున ఈ మూడు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో చాలా కాలంగా గాడిద మాంసాన్ని వినియోగిస్తున్నారు.
ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం దీని వినియోగం చట్టవిరుద్ధం. జంతువును వధించడం IPCలోని సెక్షన్ 429ని ఉల్లంఘిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఇటీవల సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SPCA), పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) కార్యకర్తలు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు దాడులు చేశారు. అక్టోబర్ 1 నుండి పోలీసులు అనేక సార్లు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పోలీసులు అనేక కబేళాల నుండి గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనేక జంతువులను రక్షించారు.
బాపట్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం.. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో జంతువులను వధిస్తున్నారు. జంతువులను మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు తెలిపారు.జంతువుల మాంసాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని అనాదిగా ఉన్న నమ్మకాల కారణంగా ఈ జంతువు మాంసానికి డిమాండ్ ఏర్పడిందని పోలీసు అధికారులు తెలిపారు. “కేజీకి 600-700 రూపాయల వరకు ధర ఉన్నప్పటికీ, పెద్ద మార్కెట్ ఉంది. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో మూలాధారమైన గుడారాల్లో వధ జరుగుతుంది” అని ఒక అధికారి తెలిపారు.
నవంబర్ 20న పోలీసులు, పెటా, SPCA కార్యకర్తల సహాయంతో ఒంగోలులో అతిపెద్ద దాడులు నిర్వహించారు. 500 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 30 జంతువులను రక్షించారు. మూడు జిల్లాల పోలీసులు ఇప్పటి వరకు అక్రమ వధ, విక్రయాలకు పాల్పడుతున్న 20 మందిని అరెస్టు చేశారు. ఒంగోలు-విజయవాడ హైవేపై అనేక చోట్ల బాపట్ల, ఒంగోలు నగరాల్లో కూడా గాడిద మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నారని ఎస్పీసీఏ వాలంటీర్లు తెలిపారు.
Tags
Related News
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి