HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Government Seeks Recusal Of Two Judges Chief Justice Says No

Amaravathi : జ‌డ్జిల‌కు `అమ‌రావతి` ఓ ఛాలెంజ్

న్యాయ‌మూర్తుల‌కే అమ‌రావ‌తి స‌వాల్ గా మారింది. సీఆర్డీఏ ర‌ద్దు పై ఏపీ హైకోర్టులో్ జ‌రిగిన వాద‌న‌ల్లో న్యాయ‌మూర్తుల నైతిక‌త‌పై ఆస‌క్తిక‌ర వాద‌న జ‌ర‌గ‌డం విచిత్రం.

  • Author : CS Rao Date : 16-11-2021 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

న్యాయ‌మూర్తుల‌కే అమ‌రావ‌తి స‌వాల్ గా మారింది. సీఆర్డీఏ ర‌ద్దు పై ఏపీ హైకోర్టులో్ జ‌రిగిన వాద‌న‌ల్లో న్యాయ‌మూర్తుల నైతిక‌త‌పై ఆస‌క్తిక‌ర వాద‌న జ‌ర‌గ‌డం విచిత్రం. ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాద ద‌వే కేసు ఆద్యంతమూ న్యాయ‌మూర్తుల ప్ర‌మేయంపై వాదించారు. సీఆర్డీయే ప‌రిధిలో న్యాయ‌మూర్తులు భూములు కొనుగోలు చేశార‌ని, అలాంటి వాళ్లు ఈ కేసు వాద‌నల నుంచి త‌ప్పుకోవాల‌ని కోరాడు. ఆ మేర‌కు సుప్రీం కోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల‌ను ఉటంకించాడు.
ముగ్గురు స‌భ్యులు గ‌ల త్రిస‌భ్య బెంచ్ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డ‌యే బిల్లు ర‌ద్దుపై వాద‌న‌ల‌ను విన‌డానికి సిద్ధం అయింది. ర‌ద్దు చ‌ట్టాల‌ను స‌వాల్ చేస్తూ రైతులు వేసిన పిటిష‌న్ల‌పై వాద‌న‌లు జ‌రిగాయి. త్రిస‌భ్య బెంచ్ లోని జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇద్ద‌రూ సీఆర్డీయే ప‌రిధిలో భూముల‌ను కొనుగోలు చేశార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది వాదించాడు. పెట్టుబ‌డి రూపంలో ఆర్థిక ప‌ర‌మైన ల‌బ్ధి కోసం ఇద్ద‌రూ చూస్తున్నార‌ని ఆరోపిస్తూ వేసిన పిటిష‌న్ ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించాడు.

Also Read : మ‌ర్రికి మొండి చెయ్యి చూపిన జ‌గ‌న్‌..పేట వైసీపీలో ముస‌లం

చంద్రబాబు ప్ర‌భుత్వం ఆనాడు న్యాయ‌మూర్తుల‌కు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. న్యాయ‌మూర్తుల‌కు ప్ర‌త్యేకంగా చదరపు గజానికి రూ.5,000 చొప్పున 600 చదరపు గజాలను కేటాయించింది. ఆ విష‌యాన్ని ప్ర‌భుత్వ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీల‌క్ష్మి అఫిడ‌విట్ లో తెలిపింది. డివిజన్ బెంచ్‌లో ఉన్న జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు ల‌కు ఆనాటి ప్ర‌భుత్వం ప్లాట్లను ఇచ్చింది.
ఇలాంటి ప‌రిస్థితిల్లో అమరావతి సమస్యకు సంబంధించిన పిటిషన్‌లను వారు విచారించడం సరికాదని శ్రీలక్ష్మి ఎత్తిచూపారు.ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ, ప్లాట్లలో పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నందున, ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకోవాలని అన్నారు. కేసు తీర్పులో న్యాయమూర్తుల భాగస్వామ్యం “న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూడాలనే సూత్రానికి విరుద్ధంగా ఉంది” అని ఆయన ఎత్తిచూపారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ సాధ్యం కాదని, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నందున తాను కూడా తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ విచారిస్తుందని నొక్కిచెప్పిన ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ విజ్ఞప్తిని సమర్థిస్తే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకుతో న్యాయమూర్తుల ఉప‌సంహ‌ర‌ణ కోరడానికి వ‌స్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.ఈ సమయంలో దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆ మేరకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కానీ, ఈ తరుణంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి స్ప‌ష్టం చేయ‌డం అమ‌రావ‌తి రైతుల‌కు కొంత ఊర‌ట‌. రోజు వారీ విచార‌ణ‌తో తుది తీర్పు వెంట‌నే ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు చీఫ్ జ‌స్టిస్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!

ఒక కేసులో తమ స్వంత ప్రయోజనాలు ఉన్నట్లయితే, కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమను తాము వదులుకోవాలని దావ్ ఉటంకించాడు. ఆ మేర‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల‌ను తెలియ‌చేశాడు. ఈ కేసులో ప్రధాన పిటిషనర్లు అధిక మార్కెట్ విలువ కలిగిన రాజధాని ప్రాంతంలో తిరిగి ప్లాట్లు పొందాలనే ఆశతో భూములను అప్పగించారనేది ప్రభుత్వ వాదనలోని సారాంశం.
సో..ఇప్పుడు డివిజ‌న్ బెంచ్ లోని ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు అమ‌రావ‌తికి అనుకూలంగా తీర్పు చెబితే ఖ‌చ్చితంగా అనుమానాల‌ను రేకిత్తించే అవ‌కాశం ఉంటుంది. అందుకే, ఈ అమ‌రావ‌తి కేసు న్యాయ‌మూర్తుల‌కే స‌వాల్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • andhra pradesh
  • ap capital

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

  • CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd