HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Government Seeks Recusal Of Two Judges Chief Justice Says No

Amaravathi : జ‌డ్జిల‌కు `అమ‌రావతి` ఓ ఛాలెంజ్

న్యాయ‌మూర్తుల‌కే అమ‌రావ‌తి స‌వాల్ గా మారింది. సీఆర్డీఏ ర‌ద్దు పై ఏపీ హైకోర్టులో్ జ‌రిగిన వాద‌న‌ల్లో న్యాయ‌మూర్తుల నైతిక‌త‌పై ఆస‌క్తిక‌ర వాద‌న జ‌ర‌గ‌డం విచిత్రం.

  • Author : CS Rao Date : 16-11-2021 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

న్యాయ‌మూర్తుల‌కే అమ‌రావ‌తి స‌వాల్ గా మారింది. సీఆర్డీఏ ర‌ద్దు పై ఏపీ హైకోర్టులో్ జ‌రిగిన వాద‌న‌ల్లో న్యాయ‌మూర్తుల నైతిక‌త‌పై ఆస‌క్తిక‌ర వాద‌న జ‌ర‌గ‌డం విచిత్రం. ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాద ద‌వే కేసు ఆద్యంతమూ న్యాయ‌మూర్తుల ప్ర‌మేయంపై వాదించారు. సీఆర్డీయే ప‌రిధిలో న్యాయ‌మూర్తులు భూములు కొనుగోలు చేశార‌ని, అలాంటి వాళ్లు ఈ కేసు వాద‌నల నుంచి త‌ప్పుకోవాల‌ని కోరాడు. ఆ మేర‌కు సుప్రీం కోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల‌ను ఉటంకించాడు.
ముగ్గురు స‌భ్యులు గ‌ల త్రిస‌భ్య బెంచ్ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డ‌యే బిల్లు ర‌ద్దుపై వాద‌న‌ల‌ను విన‌డానికి సిద్ధం అయింది. ర‌ద్దు చ‌ట్టాల‌ను స‌వాల్ చేస్తూ రైతులు వేసిన పిటిష‌న్ల‌పై వాద‌న‌లు జ‌రిగాయి. త్రిస‌భ్య బెంచ్ లోని జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇద్ద‌రూ సీఆర్డీయే ప‌రిధిలో భూముల‌ను కొనుగోలు చేశార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది వాదించాడు. పెట్టుబ‌డి రూపంలో ఆర్థిక ప‌ర‌మైన ల‌బ్ధి కోసం ఇద్ద‌రూ చూస్తున్నార‌ని ఆరోపిస్తూ వేసిన పిటిష‌న్ ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించాడు.

Also Read : మ‌ర్రికి మొండి చెయ్యి చూపిన జ‌గ‌న్‌..పేట వైసీపీలో ముస‌లం

చంద్రబాబు ప్ర‌భుత్వం ఆనాడు న్యాయ‌మూర్తుల‌కు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. న్యాయ‌మూర్తుల‌కు ప్ర‌త్యేకంగా చదరపు గజానికి రూ.5,000 చొప్పున 600 చదరపు గజాలను కేటాయించింది. ఆ విష‌యాన్ని ప్ర‌భుత్వ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీల‌క్ష్మి అఫిడ‌విట్ లో తెలిపింది. డివిజన్ బెంచ్‌లో ఉన్న జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు ల‌కు ఆనాటి ప్ర‌భుత్వం ప్లాట్లను ఇచ్చింది.
ఇలాంటి ప‌రిస్థితిల్లో అమరావతి సమస్యకు సంబంధించిన పిటిషన్‌లను వారు విచారించడం సరికాదని శ్రీలక్ష్మి ఎత్తిచూపారు.ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ, ప్లాట్లలో పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నందున, ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకోవాలని అన్నారు. కేసు తీర్పులో న్యాయమూర్తుల భాగస్వామ్యం “న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూడాలనే సూత్రానికి విరుద్ధంగా ఉంది” అని ఆయన ఎత్తిచూపారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ సాధ్యం కాదని, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నందున తాను కూడా తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ విచారిస్తుందని నొక్కిచెప్పిన ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ విజ్ఞప్తిని సమర్థిస్తే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకుతో న్యాయమూర్తుల ఉప‌సంహ‌ర‌ణ కోరడానికి వ‌స్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.ఈ సమయంలో దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆ మేరకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కానీ, ఈ తరుణంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి స్ప‌ష్టం చేయ‌డం అమ‌రావ‌తి రైతుల‌కు కొంత ఊర‌ట‌. రోజు వారీ విచార‌ణ‌తో తుది తీర్పు వెంట‌నే ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు చీఫ్ జ‌స్టిస్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!

ఒక కేసులో తమ స్వంత ప్రయోజనాలు ఉన్నట్లయితే, కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమను తాము వదులుకోవాలని దావ్ ఉటంకించాడు. ఆ మేర‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల‌ను తెలియ‌చేశాడు. ఈ కేసులో ప్రధాన పిటిషనర్లు అధిక మార్కెట్ విలువ కలిగిన రాజధాని ప్రాంతంలో తిరిగి ప్లాట్లు పొందాలనే ఆశతో భూములను అప్పగించారనేది ప్రభుత్వ వాదనలోని సారాంశం.
సో..ఇప్పుడు డివిజ‌న్ బెంచ్ లోని ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు అమ‌రావ‌తికి అనుకూలంగా తీర్పు చెబితే ఖ‌చ్చితంగా అనుమానాల‌ను రేకిత్తించే అవ‌కాశం ఉంటుంది. అందుకే, ఈ అమ‌రావ‌తి కేసు న్యాయ‌మూర్తుల‌కే స‌వాల్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • andhra pradesh
  • ap capital

Related News

Governor Abdul Nazeer Ap As

ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు

    Latest News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

    • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

    • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

    Trending News

      • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

      • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

      • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

      • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

      • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd