HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Floods Death Toll Mounts To 44 16 Missing

Andhra Floods: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకపోవడానికి కారణం తెలిపిన జగన్

ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

  • By Hashtag U Published Date - 11:31 PM, Fri - 26 November 21
  • daily-hunt

ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

వరద సహాయక చర్యలు ఆగకూడదనే తాను వరద ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లలేదని, అది కూడా సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయానని జగన్ తెలిపారు. తాను వరద ప్రాంతాలకు వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమని, అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లాలోనే ఉండమన్నామని జగన్ తెలిపారు. సహాయక చర్యల తర్వాత ఖచ్చితంగా జిల్లాల్లో పర్యటిస్తానని అయన ప్రకటించారు.

50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఫించా నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిందని, అర్ద్రరాత్రి సమయంలో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందని జగన్ తెలిపారు. వరదల వల్ల ఒక బస్సు నదిలో చిక్కుకోవటం వలన ప్రాణనష్టం జరిగిందని, రెండు మూడు గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని జగన్ వివరించారు. ముంపు గ్రామాల బాధితులకు తాగు నీరు, ఆహారం అందించామని చెప్పారు.

తాను ఏరియల్ సర్వే చేసానని, వరదలవల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిపై తనకి మమకారం ఉంటుందని, తాను ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండనని స్పష్టం చేసారు. ఈ సమయంలో జిల్లాల పర్యటనకు వెళ్తే అధికారులు
వరద బాధితుల సహాయ కార్యక్రమాలు వదిలేసి, ముఖ్యమంత్రి పర్యటనపైనే ఫోకస్ పెడతారనే కారణంతోనే తాను వెళ్లలేదని సీఎం తెలిపారు.

వరద సహాయక చర్యలకోసం 84 కోట్లు విడుదల చేసామని, ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వంద శాతం పునరుద్దరించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించామన్నారు. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని సీఎం వెల్లడించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur
  • andhra floods
  • Chief Minister YS Jagan Mohan Reddy
  • Chittoor
  • death toll
  • Kadapa

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd