HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amit Shah Fires On Jagan And Ap Government In Vizag

Amit Shah : జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అమిత్‌షా ఫైర్‌.. ఏపీలో రూట్‌మార్చిన బీజేపీ

టీడీపీతో క‌లిసి ముందుకెళ్లే విష‌యంపై బీజేపీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌న్న ప్ర‌చారం ఏపీ జోరుగా సాగుతుంది.

  • Author : News Desk Date : 11-06-2023 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah fires on Jagan and AP Government in Vizag
Amit Shah fires on Jagan and AP Government in Vizag

కేంద్రంలో బీజేపీ(BJP) ప్ర‌భుత్వం పెద్ద‌ల అండ‌దండ‌లు మాకున్నాయ‌ని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వ‌చ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి(AP CM Jaganmohan Reddy) కేంద్ర మంత్రి అమిత్‌షా(Amit Shah) షాకిచ్చారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాల‌న అంతా అవినీతిమ‌యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆదివారం విశాఖ(Vizag) ప‌ట్ట‌ణంలోని రైల్వే గ్రౌండ్‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో అమిత్ షా పాల్గొన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీ మూడో స్థానంలో ఉంద‌ని, అన్న‌దాత ఆత్మ‌హ‌త్య‌లు ఆప‌ని జ‌గ‌న్ సిగ్గుప‌డాలని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు. అమిత్‌షా తాజా వ్యాఖ్యాల‌తో ఏపీలో బీజేపీ రూట్ మార్చిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ పెద్ద‌లు ఏపీలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి రావ‌టంలో కీల‌క భూమిక పోషించార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. బీజేపీ పెద్ద‌ల నుంచి స‌హ‌కారం అంద‌డంతోనే ఏపీలో రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. అంతేకాక భారీ సంఖ్యలో ఎంపీ స్థానాల‌ను వైసీపీ గెలుపొందింది. అప్ప‌టి నుంచి కేంద్ర ప్ర‌భుత్వానికి ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృత‌జ్ఞ‌త చూపుతూ వ‌స్తున్నారు. ఏపీలోని వైసీపీ నేత‌లు సైతం కేంద్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్ త‌మ‌కే ఉందంటూ చెప్పుకుంటూ వ‌చ్చారు. ఇటీవ‌లి కాలంలో ఏపీలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ రూట్ మార్చిన‌ట్లు స్ప‌ష్టమ‌వుతోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ రాజ‌ధాని విష‌యంలో, మ‌రికొన్ని విష‌యాల్లో తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచాయి. దీనికితోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జ‌న‌సేన పార్టీతో బీజేపీ పొత్తు కొన‌సాగుతుంది. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి కొంత‌దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ప‌లు ద‌ఫాలుగా భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌సైతం ఆ మేర‌కు జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌కు సిగ్న‌ల్స్ ఇస్తూ వ‌స్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో.. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌డం, అమిత్‌షా, న‌డ్డాల‌తో భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారింది.

టీడీపీతో క‌లిసి ముందుకెళ్లే విష‌యంపై బీజేపీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌న్న ప్ర‌చారం ఏపీ జోరుగా సాగుతుంది. మ‌రోవైపు దేశంలో బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్న క్ర‌మంలో త‌న పాత‌మిత్రుల‌ను క‌లుపుకొనే ప‌నిలో బీజేపీ పెద్ద‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఏపీలో పాత‌మిత్రుడైన చంద్ర‌బాబుతో క‌లిసేందుకు ప్ర‌ధాని మోదీ సుముఖంగా ఉన్న‌ట్లు, దీంతో ఇటీవ‌ల బాబుతో అమిత్‌షా, జేపీ న‌డ్డాలు భేటీ అయిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వంపై అమిత్‌షా ఫైర్ అయిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే, అమిత్‌షా వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు ఏమేర‌కు కౌంట‌ర్ ఇస్తార‌న్న‌ది ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.

 

Also Read : Janasena : జనసేనకు ఝలక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర సాగుతుందా??


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • AP government
  • bjp
  • vizag
  • ys jagan

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Royal Stag Boom Box

    Royal Stag Boom Box : వైజాగ్ వేదికగా ‘రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్’ సీజన్ 4 సిద్ధం

  • Bihar Bjp

    BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

  • Ap Logo

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Latest News

  • రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ గుడిలో మహిళలకు ఉచిత, ప్రత్యేక దర్శనం!

  • ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

  • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

  • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd