Ambati Rambabu : సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై పోలీసులకు అంబటి ఫిర్యాదు
అంబటి ఆరోపించిన ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనపై వ్యక్తిగత స్థాయిలో కక్ష సాధింపు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వైసీపీ కండువా ధరించి అసత్య వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు తరుగజేస్తున్నారని ఆరోపించారు.
- By Latha Suma Published Date - 03:33 PM, Mon - 5 May 25

Ambati Rambabu : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ ముఖ్య నేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఆయన ఫిర్యాదు నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి, తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీడీపీ (ఐటీడీపీ) విభాగం, కొన్ని వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తుండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
Read Also: Baba Ramdev : పాక్కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
అంబటి ఆరోపించిన ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనపై వ్యక్తిగత స్థాయిలో కక్ష సాధింపు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వైసీపీ కండువా ధరించి అసత్య వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు తరుగజేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వెనుక తెలుగు దేశం పార్టీ ఉన్నదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీడీపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొంతమంది సామాజిక మాధ్యమ వినియోగదారులు, సీమ రాజా, కిర్రాక్ ఆర్పీ వంటి యూట్యూబ్ ఛానళ్లపై వేర్వేరు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.
గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు స్పందించలేదని అంబటి విమర్శించారు. టీడీపీ నేతల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటూ, తమ ఫిర్యాదులపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పూర్తిగా టీడీపీ కంట్రోల్లో ఉందని తీవ్ర ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంపై సరైన దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని, సుప్రీం కోర్టుకు వెళ్లేందుకైనా వెనకాడనని హెచ్చరించారు. దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని, పార్టీ తరపున తానే వాదిస్తానని స్పష్టం చేశారు.
Read Also: India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?