Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
- By Pasha Published Date - 01:16 PM, Tue - 11 June 24
Amaravati Vs Vizag : ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేస్తామని ఆయన వెల్లడించారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. విశాఖ న్యాయ రాజధాని అంటూ జగన్ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారని చంద్రబాబు చెప్పారు. కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండకూడదు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు’’ అని చంద్రబాబు (Amaravati Vs Vizag) స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుంది. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ‘‘ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే నా శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దాం’’ అని పేర్కొన్నారు.
తెలంగాణలోని 7 మండలాల విలీనంపై కీలక వ్యాఖ్యలు
2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ‘‘ఏపీకి పోలవరం ముఖ్యమైన ప్రాజెక్టు. దీనికి గతంలో కేంద్ర సర్కారు పూర్తిగా సహకరించింది. 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రయత్నాల వల్లే ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని అప్పట్లో మోడీకి తేల్చి చెప్పాను. దీంతో ఆయన ఆర్డినెన్స్ జారీ చేసి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ మండలాలను ఏపీకి ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రారంభమయ్యేదే కాదు’’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read : Elon Musk : ఐఫోన్లలో ఛాట్ జీపీటీ.. భారతీయ మీమ్తో ‘మస్క్’ కౌంటర్
తెదేపా-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ ఇవాళ ఉదయం విజయవాడలో జరిగింది. ఈసందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్కల్యాణ్తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబు వేదికపై కూర్చున్నారు. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చున్నారు.
Related News
Real Estate : అమరావతి ప్రభావం.. హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల విక్రయాలు..?
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మన మదిలో ఐటీ మెరుస్తుంది. ఐటీ మాత్రమే కాదు, నగరంలో రియల్ ఎస్టేట్ కూడా పెద్ద రంగం, కొన్నేళ్లుగా ఈ రంగం అభివృద్ధి చెందుతోంది.