HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amaravathi Movement Reached Delhi Bharatiya Kisan Sangh Help

Amaravathi : ఢిల్లీకి అమ‌రావ‌తి ఉద్య‌మం! భారతీయ కిసాన్ సంఘ్ మ‌ద్ధ‌తు!

అమ‌రావ‌తి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకి చేరింది.

  • By CS Rao Published Date - 06:12 PM, Sat - 17 December 22
  • daily-hunt
Amaravathi
Amaravati Farmers In Delhi

అమ‌రావ‌తి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకి చేరింది. కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించ‌డానికి  రైతులు సిద్ధం అయ్యారు. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ ధర్నాకు దిగారు. రాజ‌ధానికి(Capital) భూములు త్యాగం చేసి రోడ్డున ప‌డ్డ రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా పోరాడుతున్నారు. ప్ర‌జా క్షేత్రంలో పోరాడుతూ న్యాయ‌స్థానాలను ఆశ్ర‌యించారు. సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న మూడు రాజ‌ధానుల(3 Capital ) అంశం రైతుల‌ను న‌ట్టేట ముంచింది.

మూడేళ్లుగా నిర్విరామంగా రైతులు ఉద్య‌మిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం తీరును నిర‌సిస్తున్నారు. మ‌హా పాద‌యాత్ర‌గా న్యాయ‌స్థానం(హైకోర్టు) నుంచి దేవ‌స్థానం( తిరుమ‌ల‌) వ‌ర‌కు వెళ్లారు. రెండో విడ‌త అమ‌రావతి(Amaravathi) టూ అర‌స‌వెల్లి మ‌హాపాద‌యాత్ర‌కు దిగారు. మార్గ‌మ‌ధ్యంలోనే వైసీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డంతో న్యాయ‌స్థానంను ఆశ్ర‌యించారు. కొన్ని ఆంక్ష‌ల న‌డుమ పాద‌యాత్ర‌కు అనుమ‌తించిన విష‌యం విదిత‌మే. ఇదే స‌మ‌యంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్ వేసింది. దానిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఇదే సమ‌యంలో ఏపీకి అమరావతి(Amaravathi)నే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.

ఢిల్లీకి వెళ్లిన అమరావతి

ఢిల్లీకి వెళ్లిన అమరావతి ఉద్యమానికి టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత హరిప్రసాద్, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు జంతర్ మంతర్ కు వెళ్లి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేప‌థ్యంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. సోమ‌వారం రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు పాల్గొననున్నారు. అమరావతి రైతు ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రత్యేక అజెండాగా చేర్చింది. గ‌తంలోనూ వ్య‌వ‌సాయ బిల్లుకు వ్య‌తిరేకంగా కిసాన్ సంఘ్ చేప‌ట్టిన ఉద్య‌మానికి అమ‌రావ‌తి రైతులు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇప్పుడు కిసాన్ సంఘ్ మ‌ద్ధ‌తు అమ‌రావ‌తి రైతులకు ల‌భించింది.

సుప్రీం కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి ఏకైకా రాజ‌ధానిగా ఉండాల‌ని ఏపీలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ కోరుకుంటున్నాయి. ఒక్క వైసీపీ మిన‌హా మిగిలిన పార్టీలు రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ సుప్రీం కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వెళ్లింది. మూడు రాజ‌ధానుల దిశ‌గా ఏపీ స‌ర్కార్ అడుగులు వేస్తోంది. అయితే, రైతులు ఇచ్చిన భూములు, సీఆర్డీఏ వాళ్ల‌తో చేసుకున్న ఒప్పందాల అంశం తేలాల్సి ఉంది. అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా నిర్థారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పున స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వెళ్లింది. దానిపై ఇటీవ‌ల విచార‌ణ చేసిన సుప్రీం కోర్టు బెంచ్ త్వ‌ర‌లోనే తుది తీర్పు ఇవ్వ‌నుంది. దానిపై రైతులు ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా ఆ తీర్పుకు అనుగుణంగా న‌డ‌వ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటుంది.

Also Read : Amaravati :అమ‌రావ‌తిపై జ‌న‌వ‌రి 31కి విచార‌ణ‌ వాయిదా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • Amravati Farmers
  • delhi
  • Supreme Court

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

  • Jacqueline Fernandez

    Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

  • DSC Appointment Letters

    DSC Appointment Letters: డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఈనెల‌ 25న పంపిణీ!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd