HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Am Cm Ys Jagan U Turn On Amaravati Lands Issue

Amaravati : అమ‌రావ‌తిపై `మోసం` గురూ!

`అదో క‌మ్మ‌రావ‌తి..చంద్ర‌బాబు మ‌నుషుల ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్..రాజ‌ధానిలో ఎలాంటి నిర్మాణాలు జ‌ర‌గ‌లేదు..భ్ర‌మ‌రావ‌తి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మ‌శానం..` ఇలా ఎన్నో ఆరోప‌ణ‌లు చేశారు సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క మంత్రులు..` ఇప్పుడు అక్క‌డి నిర్మాణాల‌ను లీజుకు ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ధం అయింది.

  • Author : CS Rao Date : 27-06-2022 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati
Amaravati

`అదో క‌మ్మ‌రావ‌తి..చంద్ర‌బాబు మ‌నుషుల ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్..రాజ‌ధానిలో ఎలాంటి నిర్మాణాలు జ‌ర‌గ‌లేదు..భ్ర‌మ‌రావ‌తి గ్రాఫిక్స్ …అదో ఎడారి, స్మ‌శానం..` ఇలా ఎన్నో ఆరోప‌ణ‌లు చేశారు సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క మంత్రులు..` ఇప్పుడు అక్క‌డి నిర్మాణాల‌ను లీజుకు ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ధం అయింది. అక్క‌డి భూముల‌ను వేలం వేయ‌డానికి పూనుకుంది. ఎక‌రం రూ. 10కోట్ల క‌నీస ధ‌ర‌తో వేలం వేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది.

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప్ర‌జా వేదిక‌ను కూల్చేశారు. ఆ త‌రువాత మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. కేవ‌లం క‌మ్మ కులానికి సంబంధించిన రాజ‌ధానిగా సీఎం హోదాలో జ‌గ‌న్ ఆరోప‌ణ చేశారు. సీఐడీ విచార‌ణకు ఆదేశించారు. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన విధంగా వంద‌లాది మందిని విచారించిన సీఐడీ ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ను నిరూపించ‌లేక‌పోయింది. అంతేకాదు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ప‌దాన్నే సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. మొత్తం వ్య‌వ‌హారాన్ని హైకోర్టులో తేల్చుకోవాని ఆర్డ‌ర్ చేసింది. భూములు ఇచ్చిన రైతుల‌కు మూడు నెల‌ల్లో ప్లాట్లు ఇవ్వాల‌ని, సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం నిర్మాణాలు చేప‌ట్టాల‌ని అంతిమ తీర్పు చెప్పింది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌ని కూడా ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన అంతిమ తీర్పును భేఖాత‌రు చేస్తూ రాజ‌ధాని ప్రాంతంలోని భూముల‌ను అమ్ముకోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును అనుకూలంగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌లుచుకుంది. భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని తీర్పులో ఉన్న అంశాన్ని ఆస‌ర‌గా తీసుకుని వాళ్ల చేత ఇటీవ‌ల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం పూర్తి చేసింది. దీంతో ఇక ఆ భూములపై సంపూర్ణ హ‌క్కు ప్ర‌భుత్వానికి ద‌క్కేలా ప‌క్కా. స్కెచ్ వేశారు. అందులో భాగంగానే భూముల‌ను ఇప్పుడు అమ్మ‌కానికి పెట్టారు. ఆన్ రికార్డ్ ప్ర‌స్తుతం రైతులు ప్ర‌శ్నించ‌డానికి లేకుండా చేశామ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కానీ, హైకోర్టు తీర్పు ప్ర‌కారం చేయాల్సినవి ఏమీ చేయ‌కుండా భూముల‌ను అమ్మ‌కానికి పెట్ట‌డంపై మ‌రోసారి రైతులు కోర్టు మెట్టులు తొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

భూములు ఇచ్చిన రైతుల డిమాండ్ల‌ను మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడా వ్య‌తిరేకించారు.
అమరావతి ఎవరి కోసం అంట అంటూ పుస్త‌కాన్ని కూడా ఒక కీల‌క లీడ‌ర్ రాశారు. రాజ‌ధాని రోడ్ల‌ను కూడా త‌వ్వేశారు. అక్క‌డ రాజ‌ధాని ఉంటే మునిగిపోతుంద‌ని పుస్త‌కాల‌ను రాసిన మేధావులు ఉన్నారు. ల‌క్ష కోట్ల‌తో నిర్మాణాల‌ను చేప‌ట్ట‌లేని ఆర్థిక సంక్లిష్ట‌త ఉంద‌ని సాక్షాత్తు సీఎం జ‌గ‌న్ అన్నారు. అందుకే, ఒకే రాజ‌ధాని కాదు, మూడు రాజ‌ధానులు నిర్మిస్తాన‌ని రెండున్న‌రేళ్లుగా రైతుల‌తో ఆటాడుకున్నారు. ఇప్పుడే అదే రాజ‌ధాన్ని తాక‌ట్టు పెట్టుకుని 2,500కోట్లు రాబ‌ట్టాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నాల‌ను ప్రైవేటు సంస్థ‌ల‌కు లీజుకు ఇవ్వ‌డానికి సిద్ధం అయ్యారు. నా రాజ్యం నా ఇష్టం అన్న‌ట్టు ఉంది జ‌గ‌న్ వాల‌కం. ఇలాంటి ప‌రిస్థితుల్లో న్యాయ‌స్థానం ఎలా స్పందిస్తుందో..చూద్దాం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • amaravati land
  • CRDA
  • YS Jagan Mohan Reddy

Related News

Chandrababu

Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్

  • Minister Narayana fires on YCP

    Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd