Ramadan: రంజాన్ మాసంలో ఎఫ్ఎంలో పాటలు ప్లే చేయడం ఇస్లాం చట్టాలకు విరుద్దం, ఏకంగా రేడియో స్టేషన్ మూసివేత.
- By hashtagu Published Date - 10:04 PM, Mon - 3 April 23
రంజాన్ (Ramadan)పర్వదినాలు కొనసాగుతన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసదీక్షలు చేపడుతున్నారు. అయితే తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఠానిస్తాన్ లో మాత్రం వింత రూల్స్ తెరపైకి వచ్చాయి. పాటలు ప్లే చేసినందుకుగాను మహిళలు నిర్వహిస్తున్న రేడియో స్టేషన్ను తాలిబన్ ప్రభుత్వం మహిళా రేడియో స్టేషన్ను మూసివేసింది. ఈ వార్తను తాలిబాన్ అధికారి వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆ రేడియో స్టేషన్ పేరు సదాయి బనోవన్. స్త్రీల స్వరం అని అర్థం.
ఈ రేడియో స్టేషన్ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇందులో కేవలం 6 మంది సిబ్బంది మాత్రమే మహిళలు ఉన్నారు. బదక్షన్ ప్రావిన్స్ యొక్క సంస్కృతి, సమాచార మంత్రి రేడియో స్టేషన్పై నిషేధాన్ని ధృవీకరించారు. ఈ స్టేషన్ ఇస్లాం చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు.
ఆఫ్ఘన్ ప్రభుత్వం విధించిన అన్ని షరతులను పాటిస్తామని హామీ ఇస్తే రేడియో స్టేషన్ పునఃప్రారంభించబడుతుందని మొయిజుద్దీన్ అహ్మదీ చెప్పారు. అదే సమయంలో, స్టేషన్ హెడ్ నజియా సోరోష్, మొయిజుద్దీన్ ఆరోపణలన్నింటినీ తిరస్కరించారు. స్టేషన్ ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పారు. మేము ఏ పాటలను ప్లే చేయలేదు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందన్నారు. గురువారం ఉదయం 11.40 గంటలకు రేడియో స్టేషన్ను మూసివేయడానికి మంత్రి స్వయంగా వచ్చారని సోరోష్ చెప్పారు.
అల్జజీరా నివేదిక ప్రకారం, 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాలిబన్లు అనేక మీడియా సంస్థలను మూసివేశారు. దీంతో చాలా మంది జర్నలిస్టులు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు తాలిబన్ల మాట వినని జర్నలిస్టులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. తాలిబన్లు మహిళలు ఆరో తరగతికి మించి చదువుకోకుండా నిషేధం విధించారు. సంగీతం వినడంపై అధికారిక నిషేధం లేనప్పటికీ, మహిళలు దాని కోసం శిక్షించబడుతున్నారు.
Related News
9 Children Died : ల్యాండ్మైన్తో ఆడుకున్నారు.. పేలడంతో 9 మంది పిల్లల మృతి
9 Children Died : మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.