Pig Kidney: వైద్య చరిత్రలో అద్భుతం.. మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు
పంది కిడ్నీ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు వ్యక్తి శరీరంలో సాధారణంగా పనిచేస్తుంది.
- By Balu J Published Date - 11:54 AM, Sat - 19 August 23
వైద్య విజ్ఞాన ప్రపంచం చాలా విస్తృతమైనది. వైద్యులు నిరంతరం కొత్త పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా వైద్యులు ఓ పందికి శస్త్ర చికిత్స చేసి.. మనిషి శరీరంలోకి కిడ్నీని అమర్చారు. ఇందులో డాక్టర్లు కూడా సక్సెస్ అయ్యారని రిపోర్టులు చెబుతున్నాయి. మానవ శరీరంలో పంది కిడ్నీ బాగా పనిచేస్తుందని చెప్పబడింది. ప్రస్తుతం ఈ విషయంపై వివరమైన నివేదిక రావాల్సి ఉంది.
తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాబోయే కాలంలో కొత్త ఆశ వచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలోకి పంది కిడ్నీని అమర్చినట్లు అమెరికా వైద్యులు ప్రకటించారు. పంది కిడ్నీ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు ఈ వ్యక్తి శరీరంలో సాధారణంగా పనిచేస్తుంది. ఈ కొత్త విజయం అవయవ దానం అవసరాన్ని తీర్చే ప్రయత్నాలకు ఆశాకిరణం లాంటిది. ఈ పేషెంట్ చనిపోయాడు కానీ ఇది ఒక రికార్డు. న్యూయార్క్ యూనివర్శిటీ లాంగోన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్లోని సర్జన్లు ఒక పంది కిడ్నీ శవంలో ఎక్కువ కాలం పనిచేసిన రికార్డును సృష్టించినట్లు నివేదించారు.
Also Read: Kohli Diamond Bat: విరాట్ కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Related News
Pig Kidney : తొలిసారిగా మనిషికి పంది కిడ్నీ.. ఎందుకు ?
Pig Kidney : కిడ్నీ సమస్యలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి.