Israel War : 21 నెలలుగా యుద్ధం.. 60 వేల మంది మృతి
Israel War : ఈ యుద్ధం మొదలై ఇప్పటికే 21 నెలలు పూర్తవుతుండగా, ఇప్పటివరకు 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు అని గాజాలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- By Sudheer Published Date - 08:45 AM, Wed - 30 July 25

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel War) మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇప్పటికీ ముగింపు అనేది లేకుండా పోతోంది. ఈ యుద్ధం మొదలై ఇప్పటికే 21 నెలలు పూర్తవుతుండగా, ఇప్పటివరకు 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు అని గాజాలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది ఆధునిక యుగంలో ఒక భారీ మానవీయ విషాదంగా మారింది. ఈ యుద్ధం ఆరంభంలో హమాస్ దాడుల నేపధ్యంలో ఇజ్రాయెల్ బలమైన ప్రతిస్పందనతో దాడులు ప్రారంభించింది.
గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం.. 1.45 లక్షల మంది గాయాలపాలయ్యారు. వారిలో పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆసుపత్రులు ధ్వంసమైపోవడం, మెడికల్ సదుపాయాల లేకపోవడం వల్ల గాయపడినవారిని సరిగ్గా చికిత్స చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ హింసతో గాజా ఒక యుద్ధభూమిగా మారిపోయింది. విమాన దాడులు, ఆర్టిలరీ బాంబుల వర్షం గాజాలో ప్రతి కోణాన్ని తాకుతోంది.
Jagan : కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న జగన్
ఈ యుద్ధంతో గాజాలోని 90% ప్రజలు తమ నివాసాలు కోల్పోయారు. వారంతా శరణార్థులుగా మారిపోయారు. తినేందుకు తిండి లేదు, తాగేందుకు నీరు లేదు. దాదాపు 20 లక్షల మంది ఆకలితో బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ విధించిన ఆంక్షల కారణంగా గాజాలోకి భద్రతా, ఆహార సహాయం సరఫరా కావడం కష్టమైంది. అంతర్జాతీయ సహాయక సంస్థలు సైతం ప్రాణాలకు ముప్పుగా మారిన పరిస్థితుల్లో కార్యకలాపాలు నిలిపివేశాయి.
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటం, గాజాలో హమాస్ నుంచి ప్రతిస్పందనలు రావడం వల్ల యుద్ధం ముగిసే సూచనలు కనపడడం లేదు. అయితే ఈ పరిస్థితిని చూసి ప్రపంచదేశాలు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. లక్షలాది నిరాయుధ ప్రజలు మరణించడాన్ని మరింత కాలం నిర్లక్ష్యం చేయలేం. ఐక్యరాజ్య సమితి, శాంతి స్థాపన సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.