Kiss Controversy: దుమారం రేపుతున్న ముద్దు వివాదం, స్పెయిన్లో నిరసనల హోరు
స్పెయిన్ లో ముద్దు వివాదం పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మహిళను ముద్దు పెట్టుకోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
- By Balu J Published Date - 12:47 PM, Wed - 23 August 23
ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ 1-0తో ఇంగ్లండ్ను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో గెలిచిన తర్వాత ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇబ్బందికరమైన సంఘటన చోటు చేసుకుంది. స్పెయిన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. స్పెయిన్ స్ట్రైకర్ జెన్నీ హెర్మోసో సెలబ్రేషన్లో స్పానిష్ FA ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్ ఒక్కసారి కాదు 3 సార్లు పెదవులపై ముద్దుపెట్టుకున్నాడు. లూయిస్ రూబియాల్స్ ఒక ఫిమేల్ క్రీడాకారిణి ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్గా మారింది. దీని తరువాత ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్పెయిన్ ప్రధాని కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాలని కోరారు.
మ్యాచ్ గెలిచిన అనంతరం క్రీడాకారులు పతకాలు అందుకునేందుకు వేదికపైకి వెళ్లారు. స్పానిష్ FA ప్రెసిడెంట్ లూయిస్ రూబియాల్స్, ఇతరులతో పాటు క్రీడాకారిణులను అభినందించడానికి నిలబడి ఉన్నారు. అయితే అతను ప్రతి మహిళా క్రీడాకారిణిని కౌగిలించుకొని చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. వారంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. స్పానిష్ స్టార్ ప్లేయర్ జెన్నీ హెర్మోసో వచ్చినప్పుడు, లూయిస్ రూబియల్స్ ఆమెను కూడా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత నేరుగా పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. జెన్నీని గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.
లూయిస్ అక్కడితో ఆగలేదు, కానీ 3 సార్లు ముద్దు పెట్టుకున్న తర్వాత, అతను వెళ్ళేటప్పుడు జెన్నీ వీపుపై తడుముతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పెయిన్లో ఆగ్రహపు జ్వాలలు వ్యాపించాయి. ఆ దేశ ప్రధాని కూడా దీనిని గమనించారు. ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్, “మేము చూసినది ఆమోదయోగ్యం కాదు” అని అన్నారు. లూయిస్ రూబియల్స్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అతను గతంలో స్పానిష్ జట్లపై అభ్యంతరకరమైన ప్రకటనలు చేశాడు.
Also Read: CM Candidate BJP: బీజేపీ సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డి కాదట, రేసులో ఉన్నదెవరో మరి!
Related News
Coal Crisis: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బొగ్గు సంక్షోభం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రస్తుతం తీవ్ర బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో వారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె దీనికి కారణం. ఇది ఇలానే కొనసాగితే శాశ్వత నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు.