Khartoum Clashes: యుద్ధభూమిగా మారిన ఖార్టూమ్
సైన్యం మరియు పారామిలిటరీ దళాల మధ్య పోరులో ఖార్టూమ్ యుద్ధభూమిగా మారింది. ఎక్కడ చూసినా నేలకూలిన భవనాలు మరియు ధ్వంసమైన పౌర సదుపాయాలతో అధ్వాన్నంగా మారింది సుడాన్
- By Praveen Aluthuru Published Date - 09:17 AM, Sat - 29 April 23

Khartoum Clashes: సైన్యం మరియు పారామిలిటరీ దళాల మధ్య పోరులో ఖార్టూమ్ యుద్ధభూమిగా మారింది. ఎక్కడ చూసినా నేలకూలిన భవనాలు మరియు ధ్వంసమైన పౌర సదుపాయాలతో అధ్వాన్నంగా మారింది సుడాన్. ఈ మరణఖండలో వందలాది మంది చనిపోయారు. భారతీయులతో సహా పదివేల మంది విదేశీ పౌరులు అక్కడ చిక్కుకుపోయారు.
సూడాన్ రాజధాని ఖార్టూమ్ మరియు దాని పొరుగున ఉన్న నగరం ఓమ్దుర్మాన్ శుక్రవారం పేలుళ్లు మరియు కాల్పులతో ప్రతిధ్వనించాయి. ఇద్దరు టాప్ జనరల్స్ కోసం జరిగిన యుద్ధంలో ఆఫ్రికన్ దేశం రెండు వారాలుగా హింసలో మునిగిపోయింది. ఖార్టూమ్లో ఆర్మీ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ ప్యాలెస్ (అధ్యక్ష భవనం) మరియు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అడపాదడపా అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. .
ఆఫ్రికన్ దేశాలు, అరబ్ దేశాలు, ఐక్యరాజ్యసమితి మరియు అమెరికా కలిసి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. జనరల్స్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని తమ వివాదాలను పరిష్కరించుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా.. సూడాన్లో చిక్కుకుపోయిన టర్కీ పౌరులను తమ దేశానికి తీసుకెళ్లేందుకు ఆ దేశ విమానం ఖార్టూమ్కు వెళ్లింది. ఇక సుడాన్ లో ఇరుక్కున్న భారతీయలను తిరిగి రప్పించేందుకు ఆపరేషన్ కావేరి చేపట్టింది భారతప్రభుత్వం. కాల్పుల విరమణ సమయంలో ఇతర విదేశీ ప్రభుత్వాలు కూడా తమ పౌరులను సూడాన్ నుండి ఖాళీ చేయిస్తున్నాయి. 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
Read More: Sudan Crisis: సూడాన్ సంక్షోభం: ఘర్షణల్లో 180 మంది మృతి.. 1,800 మందికి పైగా గాయాలు