HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Corona Virus In China Situation Getting Worse Viral Video

China Corona: ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. శ్మశానాల్లో శవాలు మోసేవాళ్ళ రిక్రూట్మెంట్.. దడ పుట్టించేలా

కరోనా కారణంగా చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని దాచడానికి చైనా కొత్త కొత్త విన్యాసాలు నడుపుతోంది. 

  • Author : Hashtag U Date : 28-12-2022 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Corona
China Corona

కరోనా కారణంగా చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని దాచడానికి చైనా కొత్త కొత్త విన్యాసాలు నడుపుతోంది. గత 6 రోజులుగా అక్కడ కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని చైనా పేర్కొంది. అయితే చైనా నుంచి వస్తున్న వీడియోలు మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి.

షాంఘై నగరానికి చెందిన ఒక వీడియో..

మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ చైనాలోని షాంఘై నగరానికి చెందిన ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో షాంఘైలోని ఓ ఆస్పత్రిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి.  అతడి ప్రకారం.. ఈ వీడియో డిసెంబర్ 24 నాటిది. ఇది మాత్రమే కాదు.. జెంగ్ అన్సాన్ నగరం యొక్క వీడియోను కూడా పంచుకున్నారు. చైనాలోని శ్మశాన వాటికలు ఎలా నిండిపోయాయో ఈ వీడియోలో చూడొచ్చు.  కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం గంటల కొద్దీ క్యూ కడుతున్న వైనం దీంతో బయటపడింది. అక్కడ పరిస్థితి ఎంతగా చేయి దాటిందంటే.. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలతో శ్మశాన వాటికల పార్కింగ్ స్థలంలోనూ క్యూ కడుతున్నారు.

Dec 24, a hospital in #Shanghai.#chinacovid #ChinaCovidCases #ChinaCovidSurge #ChinaCovidDeaths #ChinaCovidNightmare #COVID #COVID19 #ZeroCovid #CCPVirus #CCP #China #CCPChina pic.twitter.com/MLC9NxoZNs

— Inconvenient Truths by Jennifer Zeng (@jenniferzeng97) December 27, 2022

శ్మశాన వాటికలలో రిక్రూట్‌మెంట్ ..

షాంఘై నగరంలో కూడా కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితిలో, షాంఘైలోని శ్మశాన వాటికలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. మృత దేహాలను మోసే వ్యక్తులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసుకుంటున్నారు. అంతే కాదు.. కరోనా సోకిన వారికి ఈ రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు.

కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా..

కరోనా మరణాల సమాచారాన్ని దాచేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
కరోనాకు సంబంధించిన మరణ గణాంకాలు ప్రపంచం ముందుకు రాకూడదని.. చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మృతుల సంబంధీకులు ఒక ఫారమ్‌పై సంతకం చేశాకే.. వారి బంధువుల మృతదేహాలను ఆసుపత్రి నుండి అందజేస్తున్నారు. ఇందులో ప్రజలు తమ బంధువులు కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులో  ఏదైనా తప్పు దావా ఉంటే.. దానికి తానే బాధ్యత వహిస్తానని సంతకం చేసే వ్యక్తి పూచీకత్తు ఇవ్వాల్సి వస్తోంది.

శ్మశాన వాటికకు పంపిన నోటీసులో..

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. బీజింగ్ లో ఒక శ్మశాన వాటికకు పంపిన నోటీసు కాపీ తాజాగా తెరపైకి వచ్చింది. శ్మశాన వాటికలోని ఏ ఉద్యోగి కూడా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిషేధం విధించినట్లు ఆ నోటీసులో రాసి ఉంది. శ్మశాన వాటికకు సంబంధించిన ఏ సమాచారాన్ని కూడా బయటి వారికి చెప్పకుండా నిషేధం విధించారు.

20 రోజుల్లో 25 కోట్ల కేసులు : నివేదిక

చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఇక్కడ గత 20 రోజుల్లో, 25 కోట్ల (250 మిలియన్లు) మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ప్రభుత్వ పత్రాల లీకేజీ తర్వాత ఈ విషయం వెల్లడైంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు పత్రాలను ఉదహరిస్తూ రేడియో ఫ్రీ ఏషియా కామెంట్ చేసింది.

‘జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత..

ఈ నెల మొదటి వారంలో చైనా లో ‘జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 20 రోజుల్లో, చైనా అంతటా దాదాపు 250 మిలియన్ల మంది కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా సంక్రమణకు సంబంధించిన డేటాను నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా సమావేశంలో సమర్పించారు.  కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే జరిగిన ఈ భేటీకి సంబంధించిన పత్రాలు లీక్ అయ్యాయి. గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 1 మరియు 20 మధ్య, 248 మిలియన్ల మంది కోవిడ్ -19 బారిన పడ్డారు, ఇది చైనా జనాభాలో 17.65 శాతం.

విధ్వంసం నేపథ్యంలో చైనా ఆంక్షలను ఎత్తివేసింది. చైనాలో కరోనా విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో, అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 8 నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, చైనా తన అంతర్జాతీయ సరిహద్దులను కూడా తెరవబోతోంది. 2020 నుండి సుమారు 3 సంవత్సరాల తర్వాత చైనా అంతర్జాతీయ నిర్బంధ నిబంధనల నుండిమినహాయించబడుతుంది. గతంలో డిసెంబర్‌లోనే వివాదాస్పద కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకుంటామని చైనా ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. చైనాలో కోవిడ్ పాలసీని ఉపసంహరించుకున్న తర్వాత కేసులు వేగంగా పెరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • corona
  • covid
  • dead bodies

Related News

donald trump modi

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును

  • US control over Venezuela.. Trump's strategy as an oil hub

    వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • No country has the right to act as an international judge: China expresses anger over Venezuela incident

    ఏ దేశానికి అంతర్జాతీయ జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు: వెనెజువెలా ఘటన పై చైనా ఆగ్రహం

  • North Korea ballistic missile tests: Tensions rise again in East Asia

    ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షలు: తూర్పు ఆసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తత

  • China Vs Taiwan

    తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?

Latest News

  • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

  • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

  • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

  • టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

Trending News

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd