Bird Flu: అక్కడ మళ్లీ బర్డ్ఫ్లూ టెన్షన్.. వేల కోళ్లను చంపేస్తున్న అధికారులు
బర్డ్ ఫ్లూ అనగానే మనకు గుర్తొచ్చేది కోళ్లు. అవును.. కోళ్ల ద్వారానే బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరుగుతుంది అనే విషయం తెలుసు కదా.
- By Balu J Published Date - 07:07 PM, Mon - 27 November 23
Bird Flu: బర్డ్ ఫ్లూ అనగానే మనకు గుర్తొచ్చేది కోళ్లు. అవును.. కోళ్ల ద్వారానే బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరుగుతుంది అనే విషయం తెలుసు కదా. ఇదివరకు మన భారత్ లో బర్డ్ ఫ్లూ వల్ల ఎన్నో వేల, లక్షల కోళ్లను చంపేశారు. కరోనాకు ముందు మనం బర్డ్ ఫ్లూ గురించి విన్నాం కానీ.. కరోనా తర్వాత బర్డ్ ఫ్లూ అంతగా మన దేశంలో వ్యాపించలేదు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో ఎక్కడో ఒక చోట ప్రబలుతూనే ఉంది బర్డ్ ఫ్లూ. తాజాగా జపాన్ ను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. దక్షిణ జపనీస్ లోని సాగాలో ఉన్న కాషిమాలో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది.
అక్కడ ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఫ్లూ సోకిన కోళ్లను వెంటనే చంపేశారు. అయినా కూడా బర్డ్ ఫ్లూ వేరే ఫారాలను విస్తరించడంతో కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. బర్డ్ ఫ్లూలో చాలా రకాల ఫ్లూలు ఉంటాయి. అందులో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఒకటి. ఈ ఫ్లూ కూడా చాలా డేంజర్. దక్షిణ జపాన్ లోనే ఈ ఫ్లూ సోకిన దాదాపు 40 వేల కోళ్లను చంపేశారు. జపాన్ లో వింటర్ సీజన్ స్టార్ట్ అయితే చాలు.. బర్డ్ ఫ్లూ రావడం కామన్. ప్రస్తుతం జపాన్ లో వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతో మళ్లీ ఆ ఫ్లూ విస్తరిస్తోంది. అయినప్పటికీ ఫ్లూ వేగంగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తోంది.
దక్షిణ జపాన్ లో లక్షల సంఖ్యలో కోళ్లను మాంసం కోసం పెంచుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫామ్ లో వెలుగు చూసిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏవియన్ కు చెందిన హెచ్5 వేరియంట్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ సోకింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ నివారణ చర్యలను అక్టోబర్ నుంచే తీసుకున్నా.. ఫ్లూ నివారణను మాత్రం ఆపలేకపోయింది.
Related News
Maggi Noodles : నూడుల్స్ తిని బాలుడు మృతి.. కారణం తెలిస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు.