Accident: ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది దుర్మరణం..78 మందికి తీవ్ర గాయాలు!
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు.
- By Nakshatra Published Date - 09:36 PM, Sun - 8 January 23
Accident: ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు. ఇటీవలె తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 78 మంది వరకూ గాయాలపాలయ్యారు. బస్సు టైరు పంక్చర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్ లో కఫ్రీన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ దేశ అధ్యక్షుడు మాక్కీ సాల్ ఈ ప్రమాదం గురించి వివరాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సెనగల్ ప్రాంతంలోని ఒకటవ నెంబర్ జాతీయ రహదారిలో బస్సులో ప్రయాణిలు ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు పంక్చర్ కావడం వల్ల రోడ్డుకు అవతలి వైపు బస్సు వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో అవతలి వైపు ఓ బస్సు వస్తుండగా ఆ బస్సును ఢీకొంది. రెండు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి.
నివీ గ్రామంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 40 మంది దుర్మరణం చెందారు. 78 మందికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా సంతాప దినాలు పాటించాలని వెల్లడించారు. అధ్వానంగా ఉన్న రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి తాను వెంటనే చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..