Angry wife: మేనల్లుడు పెళ్లికి రాలేదని కోపోద్రేకమైన భార్య… మెుగడిని చావబాదటంతో..?
అప్పుడప్పుడు కొన్ని ఘటనలు విన్నా, చూసిన వింతగానే ఉంటాయి.
- By Nakshatra Published Date - 10:00 PM, Mon - 20 March 23
Angry wife: అప్పుడప్పుడు కొన్ని ఘటనలు విన్నా, చూసిన వింతగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే ఘటన కూడా అలాంటిదే. మేనల్లుడు పెళ్లికి రాలేదన్న చిన్నకారణంతో భార్య, పిల్లలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు.దెబ్బలకు తాళలేక చాంద్వాడ్లోని కుండల్గావ్లో పూనమ్ చంద్ పవార్ అనే వృద్ధుడు మరణించాడు.ఈ ఘటనతో చందవాడ్ తాలూకా ఉలిక్కిపడింది.ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కుందల్గావ్ ప్రాంతంలోని పవార్ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ఆ సమయంలో పెళ్లి ఇంట్లోనే చాలా గొడవలు జరిగాయి.పెళ్లి రోజు తెల్లవారింది. మేనమామ తన మేనల్లుడి పెళ్లికి సిద్ధమయ్యాడు.అయితే మేనల్లుడి వివాహానికి అత్త, కోడళ్లు హాజరు కాలేదు.పెళ్లి కూడా జరిగింది.
పెళ్లిలో అందరూ మామయ్య కుటుంబానికి ఎందుకు రాలేదని అనుకున్నారు.వివాహానంతరం మరణించిన పునం చంద్ పవార్ ఇంటికి వెళ్లాడు. పెళ్లికి ఎందుకు రాలేదు అని భార్య పిల్లలను అడిగాడు. దీంతో కోపోద్రిక్తులైన భార్య, పిల్లలు పునంచంద్ను కొట్టారు. ఈ దెబ్బలకు సొమ్మసిల్లి అతడు చనిపోయాడు.
Related News
Romance in Car : పరాయి వ్యక్తి తో కారులో రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్న భర్త…
భర్త ఉండగానే..పరాయి వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కు రెడ్ హ్యాండ్ గా దొరికింది