Thailand: దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ?
సమాజంలో మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజురోజుకీ
- By Nakshatra Published Date - 07:17 PM, Thu - 27 April 23
సమాజంలో మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజురోజుకీ సైకోల సంఖ్య పెరిగిపోతోంది. మనుషుల ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి థాయ్ లాండ్ లో వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసింది. అయితే ఆ మహిళ చంపిన తన స్నేహితుల వయసు 33 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2020 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు కోసమే ఆ మహిళ అంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య విషయంలో విచారణ ప్రారంభించిన తర్వాత 32 ఏళ్ల గర్భిణీ సరరత్ రంగ్ సివుతాపోర్న్ ను తాజాగా బ్యాంకాక్ లో అరెస్టు చేశారు. ఈనెల ప్రారంభంలో ఆమె స్నేహితురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాగా ఏప్రిల్ 14వ తేదీన నిందితురాలు సరరత్ రంగ్ సివుతాపోర్న్ మరణించిన స్నేహితురాలు సిరిపోర్న్ తో కలిసి రచ్చబురి ప్రావిన్స్ కు విహారయాత్రకు వెళ్లింది. అక్కడ నది సమీపంలో బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సిరిపోర్న్ కుప్పకూలి చనిపోయింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా శరీరంలో సైనైడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె చనిపోయిన తర్వాత ఫోన్ డబ్బులు బ్యాగులు అని కనిపించకుండా పోయాయి. విషయంలో పోలీసులు పూర్తిగా విచారణ చేసిన తర్వాత మాజీ ప్రియుడుతోపాటు మొత్తం 11 మందిని సరరత్ రంగ్ సివుతాపోర్న్ హత్య చేసినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చనిపోయిన వారందరూ శరీరంలో కూడా సైనైడ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అలా చనిపోయిన బాధితుల నగదు మాయమైనట్లు బంధువుల ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. మరణించిన కొన్ని నెలల తర్వాత శవాలలో సైనైడ్ గుర్తించవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కాగా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సరరత్ రంగ్ సివుతాపోర్న్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసమే అలాంటి పనులు చేసిందని పోలీసులు ఆరోపించగా ఆమె మాత్రం ఆరోపణలను ఖండించింది.
Related News
HPGL Season 4: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ విజేత సామా ఏంజెల్స్
యువ గోల్ఫర్స్ ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ లో సామా ఏంజెల్స్ ఛాంపియన్ గా నిలిచింది. బ్యాంకాక్ నికాంటి గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు టీమ్ ఆల్ఫా పై 60-20 స్కోర్ తో విజయం సాధించింది.